రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని చెబుతూ ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతెలిపారు. మతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం ప్రవచన మండపంలో భక్తుల నుద్దేశించి ప్రసంగీస్తూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతిమను దూరం నుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుందని చెప్పారు.
రామానుజాచార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని తెలిపారు. అనేక యుగాలవరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుందని చెబుతూ సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుందని పేర్కొన్నారు.
రామాయణ, భారత కాలాలనుంచి నుంచి ఇప్పటివరకు సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుందని, సనాతన ధర్మం యాత్ర ఆగిపోదని అమిత్ షా స్పష్టం చేశారు. పైగా, ప్రపంచమంతా విస్తరిస్తుందని చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందుకు సాగుతున్న చిన్నజీయర్ స్వామికి ఆయన అభినందనలు తెలిపారు.
“నేను జన్మతా వైష్ణవుడిని. ఇంతమంది ఆచార్యులు, సాదు సంతవులు ముందు విశిష్టాద్వైతం గురించి మాట్లడలేను. రామానుజాచార్యుడు గురువు ఆదేశాలను దిక్కరించి ఆయన బోధించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికి వినిపించారు. ఆలయం శిఖరంపైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సాధారణ ప్రజలకు వినిపించారు” అని పేర్కొన్నారు.
రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్ని సూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారని అమిత్ షా కొనియాడారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడి బోధనలు చేశారని అంటూ రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహం తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయని గుర్తు చేశారు.
ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాలల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని అంటూ సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారని చెప్పారు. వినమ్రత, సంస్కరణకోసం చేసే విప్లవం ఇవి రెండు కలిస్తేనే ఉద్దరణ ప్రక్రియ ఆవిష్కారమవుతుందని తెలిపారు.
దేవాలయాలు, గృహాల్లో పూజ చేయడానికి రామానుజాచార్యుడు విది విధానాలను నిర్దేశన చేశారని అమిత్ షా పేర్కొన్నారు.ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్ చేరుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, బిజేపి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఘన స్వాగతం పలికారు. తిరునామం, పంచెకట్టుతో వచ్చిన అమిత్ షా.. ముచ్చింతల్లోని దివ్య క్షేత్రాలను దర్శించుకున్నారు.
కేంద్రం విశిష్టతను చినజీయర్ స్వామి హోంమంత్రికి వివరించారు. అనంతరం శ్రీరామానుజుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత దాదాపు రెండున్నర గంటల పాటు సహస్రాబ్ది వేడుకల్లో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. అనంతరం యాగశాలలో జరిగే పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
‘‘ఎలాంటి అర్భాటం లేకుండా, ప్రభుత్వ మర్యాదలు పొందకుండా ఒక గ్రామంలో కూర్చుని భూకంప బాధితుల కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాకే ఆయన తిరిగి వెళ్లారు. ఇప్పుడు కూడా సమతామూర్తి విగ్రహ ఏర్పాటును విజయవంతంగా పూర్తిచేశారు. ఆయన చేపట్టిన కార్యం ఏదైనా విజయవంతగా ముగిస్తారు’’ అంటూ ప్రశంసించారు.
అంతకుముందు.. ఆశ్రమంలో ఏర్పాటుచేసిన ప్రివ్యూ థియేటర్ను అమిత్ షా ప్రారంభించి లేజర్ షోను తిలకించారు. భద్రవేదిలోని రామానుజుల జీవిత చరిత్రకు సంబంధించిన ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. లక్ష్మీనారాయణ యాగం పూర్ణ్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని బయటకు వెళుతూ.. చినజీయర్ స్వామికి పాదాభివందనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి