పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతియేటా పెట్టుబడి సాయంగా కేంద్రం రూ.6వేలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో 2వేల చొప్పున విడుదల చేస్తూవస్తోంది. ప్రస్తుతం 10వ విడుతగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
కరోనా మహమ్మారి ఓ వైపు కొనసాగుతున్నప్పటికీ 2021 సంవత్సరంలో దేశం ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం, స్టార్టప్, పర్యావరణం, మౌలిక సదుపాయాలు లాంటి రంగాల్లో సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశం సాగించిన బలమైన పోరాటానికి, అలాగే ఈ సంవత్సర కాలంలో చేపట్టిన సంస్కరణలకు గాను 2021 సంవత్సరం గుర్తిండిపోతుందని ప్రధాని చెప్పారు.
అంతేకాకుండా 145 కోట్లకు పైగా కరోనా టీకాల డోసుల రికార్డును సాధించడాన్ని ఆయన ప్రశంసించారు. గడచిన ఏడాది భారత్ వివిధ రంగాల్లో సంస్కరణలను వేగవంతం చేసిందని, ఆధునిక మౌలిక సదుపాయాలను సృష్టించిందని ప్రధాని తెలిపారు. ‘ అభివృద్ధి వేగాన్ని మరింతగా పెంచాలని చెబుతూ మహమ్మారి సవాళ్లను విసురుతోందని, కానీ అభివృద్ధి ప్రక్రియను అడ్డుకోలేదని ప్రధాని స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతానికి కన్నా ఎక్కువగా వృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, విదేశీ ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, జిఎస్టి వసూళ్లు సైతం పెరుగుతున్నాయని కొత్త ఏడాదిలో చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయని, ఎగుమతుల విషయంలో ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయ రంగంలో దేశం సరికొత్త నమూనాలను నెలకొల్పిందని కూడా ఆయన చెప్పారు. మహిళల వివాహ వయసును మగవారితో సమానంగా 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు పెంచే ప్రక్రియను చేపట్టినట్లు కూడా ప్రధాని చెప్పారు.
More Stories
జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
ఝార్ఖండ్ మంత్రి సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు