భారతదేశం, మయన్మార్ సైన్యాలు సంయుక్త ఆపరేషన్ తర్వాత 2019 లో ఈ శిబిరాలన్నింటిని ఖాళీ చేయడంతో ఉగ్రవాద కార్యకలాపాలు అక్కడ ఆగిపోయాయి. అయితే సైనిక పాలన వచ్చిన తర్వాత, గత కొన్ని నెలలుగా ఈ శిబిరాలు మళ్లీ చురుకుగా మారాయి.
భారత ఏజెన్సీలకు అందిన సమాచారం ప్రకారం, ఈ ఉగ్రవాదులు గత నెలలో మణిపూర్ సరిహద్దులో 46వ అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బిప్లబ్ త్రిపాఠి, అతని భార్య, కొడుకుతో పాటు మరో 4 మంది సైనికులను హతమార్చారు. ఆ ఘటన తర్వాత వారంతా సురక్షిత స్వర్గాన్ని వెతుక్కుంటూ మయన్మార్ సరిహద్దుల్లోకి ప్రవేశించి ఇప్పటికీ సియాల్మీ సమీపంలోని అడవుల్లో తలదాచుకుంటున్నారు.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, యుఎన్ఎల్ఎ, పిఎల్ఎ, ప్రీప్యాక్ కు చెందిన 150 మంది ఉగ్రవాదులను చిన్ స్టేట్ గ్రామాలకు తీసుకువచ్చారు. తద్వారా వారు భారతదేశంలోకి చొరబడ్డారు. అదేవిధంగా, ఇటీవల మయన్మార్ నుండి చొరబడిన తిరాప్, చాంగ్లాంగ్ జిల్లాలలో డజన్ల కొద్దీ ఎన్ ఎస్ సి ఎన్ (కెవైఎ) ఉగ్రవాదులు చురుకుగా తిరుగుతున్నారు.
వివిధ ఉగ్రవాద ముఠాలకు చెందిన 30-40 మంది ఉగ్రవాదులు మణిపూర్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రోజుల్లో మణిపూర్తో పాటు నాగాలాండ్లోనూ తీవ్రవాద ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో మయన్మార్లో స్థావరం ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద ముఠాలపై మయన్మార్ ఆర్మీతో పాటు భారత సైన్యం భారీ చర్యలు చేపట్టింది. కొన్ని వారాల పాటు సాగిన ఈ ఆపరేషన్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతోపాటు ఉగ్రవాదులు హతమయ్యారు.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ