భారత వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు వార్తల వ్యాప్తికి పాల్పడుతున్న 20 యుట్యూబ్ చానళ్లు, 2 వెబ్సైట్లపై వేటు వేసినట్ల్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. నిఘా సంస్థలతో సమన్వయం చేయడం ద్వారా తాము ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.
20 చానళ్లను బ్లాక్ చేయాలని వీడియోలను షేర్ చేసే యుట్యూబ్కు ఒక ఉత్తర్వును, న్యూస్ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ మరో ఉత్తర్వును మంత్రిత్వశాఖ జారీచేసింది.
పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తూ భారతదేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న చానళ్లు, వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కశ్మీరు, భారత సైన్యం, భారత్లోని మైనారిటీ వర్గాలు, రామ మందిరం, జనరల్ బిపిన్ రావత్ మొదలైన అంశాలపై ఒక సమన్వయంతో ఈ చానళ్లు, వెబ్సైట్లు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని తెలిపింది. ఈ యూట్యూబ్ చానళ్ళకు మొత్తంగా 35 లక్షల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండటం గమనార్హం.
భారత ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలు సమన్వయంగా వ్యవహరించి పాకిస్తాన్ డిజిటల్ కుట్రను వెలికి తీశాయి. పాకిస్తాన్ నుంచి పనిచేసే నయా పాకిస్తాన్ గ్రూపు ద్వారా ఈ తప్పుడు వార్తల వ్యాప్తి జరుగుతోందని, ఎన్పిజికి కొన్ని యుట్యూబ్ చానళ్లు ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
More Stories
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్
మణిపూర్లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
ఇక ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్ఈ పరీక్షలు