డిసెంబరు 8వ తేదీన జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ రక్షణ సలహాదారు బ్రిగేడియర్ లఖ్బిందర్ సింగ్ లిద్దర్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వైమానిక దళ హెలికాప్టర్ సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారు.
ఈ విషయాన్ని బుధవారం భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్లో, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అమరుడైనందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన 2021 డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారని తెలిపింది. వరుణ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపింది.
ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు కూనూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మంది మరణించారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలచివేసిందని తెలిపారు.
“గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ దేశానికి గర్వం, పరాక్రమం, అత్యంత వృత్తి నైపుణ్యంతో సేవ చేశాడు. ఆయన మృతి పట్ల నేను తీవ్ర వేదనకు లోనయ్యాను. దేశానికి ఆయన చేసిన గొప్ప సేవ ఎన్నటికీ మరువలేనిది. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపం. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు.
బెంగుళూరులోని ఎయిర్ ఫోర్స్ కమాండ్ హాస్పిటల్కు తరలించడానికి ముందు వెల్లింగ్టన్లోని మిలిటరీ ఆసుపత్రిలో తీవ్రంగా కాలిన గాయాలకు చికిత్స పొందారు.
39 ఏళ్ల అతను రక్షణ కుటుంబానికి చెందినవాడు. అతని సోదరుడు ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడు. అతని తండ్రి కల్నల్ (రిటైర్డ్) కెపి సింగ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో భాగం. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
More Stories
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు