మావోయిస్టుల హింసాకాండ, టెర్రర్ మాడ్యూళ్లపై చర్యలు, సైబర్ నేరాలు వంటి అంశాలు ప్రముఖంగా చర్చలలో చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు సంస్థల డీజీలు, మరో 350 మంది సీనియర్ పోలీసు అధికారులు మూడు రోజుల సదస్సులో రెండో రోజు పాల్గొన్నారు.
సైబర్ నేరాలు, తీవ్రవాద వ్యతిరేక సవాళ్లు, వామపక్ష తీవ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో అభివృద్ధి చెందుతున్న ధోరణులతో సహా పలు అంశాలపై సదస్సు చర్చించినట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహిస్తున్న ఈ సదస్సు హైబ్రిడ్ ఫార్మాట్లో జరుగుతోంది. రాష్ట్రాలు మరియు ఇతర పోలీసు సంస్థల డిజిపిలు భౌతికంగా ఇక్కడ సమావేశానికి హాజరయ్యారు, మిగిలిన ఆహ్వానితులు దేశవ్యాప్తంగా 37 వేర్వేరు ప్రదేశాల నుండి వర్చ్యువల్ గా పాల్గొంటున్నారు.
విస్తృత స్థాయిలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉగ్రవాద నిరోధక చర్యలలో తలెత్తుతున్న సవాళ్లు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణాతో తలెత్తుతున్న సామాజిక ఆర్థిక నేరాలు, ప్రత్యేకిం చి వామపక్ష తీవ్రవాద బెడద ఇప్పటికీ పొంచి ఉన్న రా ష్ట్రాలపై కూడా దృష్టి సారించారు. డిజిపిల వార్షిక సదస్సుకు ప్రధాని హాజరుకావడం 2014 నుంచి క్రమం తప్పకుండా జరుగుతోంది.
కేవలం తాను సదస్సుకు హాజరుకావడమే కాకుండా వివిధ స్థాయిల చర్చలలో ని అంశాలను తెలుసుకోవడం, ఇక్కడ స్వేచ్ఛాయుత, ఇష్టాగోష్టి సంప్రదింపులకు వీలు కల్పించడం వంటి వాతావరణాన్ని కల్పిస్తూ వస్తున్నారు. దేశాన్ని ప్రభావితం చేసే సంక్లిష్టమైన అంతర్గత భద్రతా అంశాలు అనేకం డిజిపి స్థాయి భేటీలలో ప్రస్తావనకు వస్తాయి. తాము ఎదుర్కొంటున్న వాస్తవిక క్షేత్రస్థాయి విషయాలను ప్రధాని మోడీకి డిజిపిలు నేరుగా నివేదించేందుకు ఈ దశలో వీలేర్పడుతుంది.
More Stories
123 ఏళ్ళ తర్వాత అలీఘర్ యూనివర్శిటీ విసిగా మహిళ
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే
మోదీ – మమతా మధ్య పోరుగా మారిన బెంగాల్ ఎన్నికలు