జమ్మూలో మంచువర్షానికి చిక్కుకుని రెండువారాలుగా ఆహారం లేకుండా అలమటించిన రాష్ట్రానికి చెందిన 18 మంది లారీ డ్రైవర్లను తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదుకున్నారు. ఆమె చొరవతో ఆ 18 మంది ప్రాణా లతో బయటపడ్డారు.
అక్టోబరు 12వ తేదీన పాలక్కాడు నుంచి 18 లారీల్లో కేబుళ్లను ఎక్కించుకుని సేలం, తిరువణ్ణామలై జిల్లాలకు చెందిన 18 మంది డైవర్లు లడాక్కు బయలుదేరారు. అక్టోబరు 20న ఆ లారీలు శ్రీనగర్ చేరుకున్నాయి. అప్పటికే అక్కడ దట్టంగా మంచువర్షం కురుస్తోంది. అన్నివైపులా దట్టమైన మంచు కప్పుకుని రహదారులు మూతపడ్డాయి.
మంచు కారణంగా ఆ మార్గాలలోని హోటళ్ళు, దుకాణాలు కూడా మూసివేశారు. దీంతో తమిళ లారీడ్రైవర్లు ఆహారం లభించక అల్లాడిపోయారు. ఆ లారీ డ్రైవర్లు తమ దుస్థితిని సెల్ఫోన్లో కుటుంబీకులకు పంపిన వీడియో సామాజిక ప్రసారమాధ్యమాల్లో ప్రసారమయ్యాయి.
ఆ దృశ్యాలను చూసిన తమిళిసై తక్షణం వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఏడీసీ తుషార్శ్రీని పురమాయించారు. ఆమె చొరవతో జమ్మూలోని సైనికాధి కారులు ఆ డ్రైవర్లను చేరదీసి సైనికశిబిరాల్లో బస కల్పించారు. అంతేగాక వారికి ఆహారం అందిస్తున్నారు. ఈ వివరాలను సేలం ఆత్తూరుకు చెందిన డ్రైవర్ సురేష్ తన కుటుంబీకులకు చేరవేయడంతో సమాచారం బయటకు పొక్కింది. దీంతో డ్రైవర్ల కుటుంబాలన్నీ తమిళిసైకి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి.
More Stories
తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి
కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం
దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ రావాలి