సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్పై అమిత్షా విమర్శలు గుప్పించారు. ఐదేళ్లుగా ఇంటిపట్టే కూర్చుని, ఇప్పుడు కొత్త బట్టలు కుట్టించుకుని, అధికారంలోకి వస్తామంటూ కొందరు చెబుతున్నారని అంటూ విమర్శించారు.
“అఖిలేష్ బాబును నేను ఒకటే అడగదలచుకున్నాను. ఈ ఐదేళ్లలో ఆయన ఎన్ని రోజులు విదేశాల్లో గడిపారు? కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నారు?” అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యక్తులు తమ కుటుంబం కోసం, కులం కోసం ప్రభుత్వాలు నడిపారని, కనై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అందరి కోసం పనిచేసింది” అని షా కొనియాడారు.
నాలుగు కోట్ల సభ్యత్వాలు లక్ష్యంగా చేపట్టిన ”మేరా పరివార్-బీజేపీ పరివార్” ప్రచారం ఈనెల 29 నుంచి డిసెంబర్ 31 వరకూ జరుగుతుందని, పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగించాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని అమిత్షా దిశానిర్దేశం చేశారు.
ప్రజలు, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. 2017లో ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం నెరవేర్చామని తెలిపారు. వచ్చే కొద్దీ నెలల్లో ఎన్నికల లోగా 100 శాతం పూర్తి చేసి, బీజేపీకి ఏదైతే చెబుతుందో అదే చేస్తుందని ప్రజలకు చూపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్పీ, బీఎస్పీలు రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే, ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ అభివృద్ధిని పట్టాల మీదకు తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ప్రశంసించారు.
More Stories
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు