తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న కేసీఆర్ మాటలకు బదలా తీర్చుకుంటానని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ గతంలో దళితులను అవమానించి, గంజిలో ఈగలాగా కేసీఆర్ తీసేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు దళితబంధు తాను ఇస్తున్నట్లు, ఇతరులు ఆపుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
తాత్కాలికంగా నిజం ఓడిపోయినట్లు కనిపించొచ్చు.. నిజం నిప్పులాంటిది.. తప్పకుండా బయటకు వస్తుందని భరోసా వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణలో 85 శాతం దళిత, బీసీలే ఉన్నారని కేసీఆర్ అన్నారని, దళితుడినే మొదటి సీఎం చేస్తానని, అవసరమైతే తలనరుక్కుంటా తప్ప మాటతప్పనన్నాడని గుర్తు చేశారు.
కాపాలకుక్కలా ఉంటానని.. మొదటి ద్రోహం దళితులకే చేశాడు. మూడెకరాల భూమి ఎగ్గొట్టాడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు. దళితుల ప్రైడ్ అనే స్కీం పెట్టినా.. వారికి రావాల్సిన రుణాల సబ్సిడీ ఇవ్వకుండా చెలగాటమాడుతున్నాడని ఈటెల విమర్
సీఎం మోసాన్ని గ్రహించకుండా కొంతమంది మేధావులు ఆహా, ఓహో అంటున్నారని చెప్పారు. దళితబంధు
నన్ను విడిచి పోయిన వాళ్ల బతుకు ఈ నెల 30 తర్వాత బజారున పడుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను, మంత్రులనే లోపలికి రానీయని కేసీఆర్.. వీళ్లను ఎలా దేకుతాడు? అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి, పదుల కొద్ది మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి తనను చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఈటల రాజేందర్ను కొట్టగలిగే శక్తి కేసీఆర్కే కాదు.. ఆయన జేజెమ్మకు కూడా లేదని స్పష్టం చేశారు.
“నీకే తెలివి, డబ్బులు, ప్రజాబలం ఉన్నాయనుకుంటున్నావా? నేనేంటో ప్రజలకు తెలుసు. నీవు ఎన్ని దావతులిచ్చినా, ఎన్ని పథకాలు ఇచ్చినా, ఓటుకు 20 వేలు ఇచ్చినా నిన్ను నమ్మరు” అంటూ భరోసా వ్యక్తం చేశారు. తలకిందకు, కాళ్లు పైకి పెట్టి పబ్బతి పట్టినా.. కేసీఆర్ అహంకారాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారని ధీమా వ్యక్తం చేశారు.
`ఈ నెల 30 వరకు మాత్రమే మీరు మాట్లాడుతారు. ఆ తర్వాత.. ఆ మాటలకు బదలా తీర్చుకుంటా. మిమ్మల్ని నిద్రపోనీయను. ఊరంతా ఒకదారి.. ఊసరవెళ్లి మరోదారి అనే వారి గురించి పట్టించుకోకుండా నన్ను ఆశీర్వదించండి’ అని ఈటల ప్రజలను కోరారు.
తెలంగాణను అప్పుల్లో ముంచారు
కాగా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్న టీఆర్ఎస్ నాయకులు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ ఆస్తులను అమ్ముతోందని టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. భూములను అమ్ముతున్నది టీఆర్ఎస్సేనని పేర్కొన్నారు.
తెలంగాణలో గడీల రాజ్యం కావాలా..? పేదోళ్ల రాజ్యం కావాలా..? ఆలోచించాలని కోరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్, తుమ్మనపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లె, కనుకులగిద్దె గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం ప్రచారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి వెచ్చించే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు.
ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ నాయకులు డబ్బులతో ఓట్లు కొని గెలవాలని చూస్తున్నారని, దొంగ ఉత్తరాలు సృష్టించి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దళితబంధుపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో భూసార పరీక్షల కోసం కేంద్రం రూ.120 కోట్లు ఇస్తే ఆ డబ్బులను సీఎం కేసీఆర్ దారి మళ్లించి హుజూరాబాద్లో పంచే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ విమర్శించారు.
More Stories
కాంగ్రెస్ పార్టీకి రూ.1823 కోట్ల ఐటీ నోటీసు
కాంగ్రెస్ లోకి కేశవరావు, కడియం శ్రీహరి
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు