గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) టర్కీని పాకిస్థాన్తో పాటు దేశాల గ్రే లిస్ట్లో చేర్చింది. ఎఫ్ఎటిఎఫ్ నిర్ధేశించిన నాలుగు చర్యల అంశాలను అందించడంలో విఫలమైనందుకు పాకిస్తాన్ని పర్యవేక్షణ (గ్రే లిస్ట్) కింద నిలుపుకుంది. ‘అల్ ఖైదా కోసం టెర్రర్ ఫైనాన్సింగ్’ చేసినందుకు తాజాగా టర్కీని గ్రేలిస్ట్ లో చేర్చారు. టర్కీలో ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న మనీలాండరింగ్, తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాద ఫైనాన్సింగ్ రిస్క్ వాతావరణంపై ఎఫ్ఎటిఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
“2019 చివరిలో టర్కీ పరస్పర మూల్యాంకనం, అంచనాను కలిగి ఉంది. మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ను నిరోధించడానికి, ఎదుర్కోవడానికి టర్కీ చేసిన ప్రయత్నానికి సంబంధించి అనేక తీవ్రమైన సమస్యలను ఈ నివేదిక వివరించింది. అప్పటి నుండి, టర్కీ ఆందోళన చెందుతున్న అన్ని రంగాలలో కొంత పురోగతిని సాధించింది. అయితే, తీవ్రమైన సమస్యలు మిగిలి ఉన్నాయి” అని ఎఫ్ఎటిఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ మార్కస్ ప్లీయర్ తెలిపారు.
“ఇందులో పర్యవేక్షణకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, ప్రత్యేకించి బ్యాంకులు, విలువైన రాళ్ల డీలర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వంటి అధిక-ప్రమాదకర రంగాలు” అని ప్లీయర్ చెప్పారు. మరోవంక, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తన భూభాగంలో నివసిస్తున్న ఉగ్రవాదులకు ఉగ్రవాద ఫైనాన్సింగ్ను అరికట్టడంలో విఫలమైనందున పాకిస్తాన్ ను ఎఫ్ఎటిఎఫ్ గ్రే జాబితాలో కొనసాగించింది.
కాల్ ఫర్ యాక్షన్ ‘డాక్యుమెంట్కి లోబడి ఉన్న హై-రిస్క్ జరిస్డికేషన్స్లో, ఉగ్రవాద ఫైనాన్సింగ్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంస్థ స్పష్టం చేసింది.
అల్బేనియా, బార్బడోస్, బుర్కినా ఫాసో, కంబోడియా, ది కేమన్ దీవులు, హైతీ, జమైకా జోర్డాన్, మాలి, మాల్టా, మొరాకో, మయన్మార్, నికరాగువా, పాకిస్తాన్, పనామా, ఫిలిప్పీన్స్, సెనెగల్, దక్షిణ సూడాన్, . సిరియా, టర్కీ, ఉగాండా, యెమెన్, జింబాబ్వ లతో సహా 23 దేశాలు ఎఫ్ఎటిఎఫ్ తాజా గ్రే జాబితాలో ఉన్నాయి. అయితే ఈ జాబితా నుండి బోట్స్వానా, మారిషస్ లను తొలగించారు.
భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి ఐక్యరాజ్యసమితి నిర్దేశిత ఉగ్రవాదులపై, వారి నేతృత్వంలోని ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ సమాజంకు నమ్మకం కలిగించలేక పోయిన పాకిస్థాన్ ఈ జాబితాలో కొనసాగ వలసి వచ్చింది.
“పాకిస్తాన్ అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంది, అయినా ఐక్యరాజ్యసమితి నిర్ధారించిన తీవ్రవాద గ్రూపుల సీనియర్ నాయకత్వానికి వ్యతిరేకంగా విచారణలు కొనసాగుతున్నాయని నిరూపించాల్సిన అవసరం ఉంది” అని మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్కు వ్యతిరేకంగా ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ సంస్థ అధ్యక్షుడు తెలిపారు.
“మేము తీసుకొంటున్న ఈ చర్యలన్నీ ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, అవినీతిని అరికట్టడానికి, వ్యవస్థీకృత నేరస్థులు తన నేరాల నుండి లాభం పొందకుండా నిరోధించడానికి అధికారులకు సహాయపడటం కోసమే” అని ఆయన స్పష్టం చేశారు.
More Stories
తైవాన్ లో గంటల వ్యవధిలో 80 సార్లు కంపించిన భూమి
మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ భారీ విజయం
సముద్రంలో కూలిన రెండు జపాన్ నేవీ హెలికాప్టర్లు