“మీరు నిరసనకు వెళ్లాలనుకుంటున్నారు. దేనిపై నిరసన? ప్రస్తుతం ఎలాంటి చట్టం లేదు. ఈ కోర్టు దీనిని నిలిపివేసింది. తాము వాటిని అమలు చేయరని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పుడు దేని కోసం నిరసన తెలియజేయాలి” అంటూ కోర్ట్ ప్రశ్నించింది.
“వారు ఒకేసారి రెండు గుర్రాలను స్వారీ చేయలేరు,” అని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఒక పార్టీ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనకు ఎక్కడికి వెడతారు అని ఆయన ప్రశ్నించారు. నిరసనను నిలిపివేయాలని అత్యున్నత న్యాయ అధికారి వాదించినప్పుడు, ఆస్తికి నష్టం జరిగినప్పుడు, భౌతిక నష్టం జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరని బెంచ్ చెప్పింది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ అంశం అత్యున్నత రాజ్యాంగ న్యాయస్థానం ముందు ఉన్న తర్వాత, అదే సమస్యపై ఎవరూ వీధుల్లో ఉండలేరని స్పష్టం చేశారు. పిటిషనర్ కిసాన్ మహాపంచాయత్ అధ్యక్షుడు తరఫున హాజరైన అడ్వకేట్ అజయ్ చౌదరి మాట్లాడుతూ పిటిషనర్ ఏ జాతీయ రహదారి వద్ద నిరసనలు జరపడం లేదని, రోడ్డులపై అడ్డంకులు కలిగించడం లేదని తాము కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు.
ఈ చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ రాజస్థాన్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున, దానిని సుప్రీంకోర్టుకు బదిలీ చేసి, దీనితో పాటు ,ఈ అంశాన్ని కూడా విచారించవచ్చని బెంచ్ తెలిపింది. రాజస్థాన్ హైకోర్టు నుండి ఆ రిట్ టిషన్ రికార్డును వెంటనే తెప్పించి, ప్రస్తుత రిట్ పిటిషన్తో పాటు విచారణకు బదిలీ చేసిన కేసుగా నమోదు చేయడానికి వెంటనే రిజిస్ట్రీని ఆదేశించారు.
More Stories
డబ్బులేకే పోటీ చేయడం లేదు .. నిర్మలా
కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం
ఫిలిబిత్ ప్రజలతో సంబంధం రాజకీయాలకతీతం