విపత్తులు సంభవించినప్పుడు తక్షణ ఎలా స్పందించాలి, ప్రజలను ఆపద నుంచి ఎలా కాపాడాలి వంటి విషయాలపై ఇందులో శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టులో పాలుపంచుకునే వారికి బీమా సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి 28 రాష్ట్రాలతో ఒప్పందాలు కూడా జరిగాయని తెలిపారు.
వరదలు తరచూ సంభవించేందుకు అవకాశం ఉన్న 25 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో చేపట్టిన ‘ఆపద మిత్ర’పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాన్లు సంభవించినప్పటికీ ముందస్తు ప్రణాళిక, అప్రమత్తత కారణంగా ఎక్కడా ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ కూడా దెబ్బతినలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కూడా సంభవించలేదని వివరించారు. 1999లో ఒడిశాలో సంభవించిన తుపానులో 10 వేల ప్రజలు ప్రాణాలు కోల్పోగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు సంభవించిన మూడు తుపాన్లలో 50 మంది కంటే తక్కువగానే మృతి చెందారని గుర్తుచేశారు. ఎలాంటి విపత్తులోనైనా సరే ప్రాణనష్టం వాటిల్లకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. పిడుగుపాట్లు వంటి వాటికి అమల్లోకి వచ్చిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థతో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.
వనరులు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని మిగతా దేశాల కంటే సమర్థంగా ఎదుర్కొందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. మహమ్మారిపై పోరాటంలో మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో ప్రభుత్వం విజయం సాధించిందనీ, ఏ తటస్థ ఏజెన్సీతో అధ్యయనం చేయించినా ఇదే విషయం నిర్ధారణ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
More Stories
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు