టీఆర్ఎస్​ `గూండాల’ దాడిలో బీజేపీ కార్యకర్త మృతి

టీఆర్ఎస్​ నేతల దాడిలో బీజేపీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. మహబూబ్​నగర్ ​జిల్లా భూత్పూర్‌‌ మండలం కొత్త మొల్గర
గ్రామానికి చెందిన మహేశ్‌‌(23) బీజేపీ కార్యకర్త. గ్రామంలో శివాలయం ముందు ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన దాడిలో మృతి చెందాడు. 
 
గ్రామ ప్రజల అందరి సహకారాలతో ప్రతిష్టించిన శివ వినాయక దేవాలయం మండప వినాయకుడు నిమర్జనం మంగళవారం రాత్రి జరిగింది దానిలో భాగంగా గ్రామ ప్రజలు యువకులు పెద్ద యెత్తున స్వామి వారి నిమ్మర్జన్ కార్యక్రమం లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు అందరి సహకారాలతో ప్రతిష్టించిన వినాయకుడికి స్థానిక  టీఆర్ఎస్​ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డి గారిని ఆహ్వానించి. ఆ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్​ పార్టీ వినాయకుని గా చిత్రీకరించడం కోసం వినాయకుడికి పార్టీ రంగు పులిమారు. 

వినాయకుడు నిమర్జనం యాత్ర లో అదే గ్రామనికి చెందిన బిజెపి కార్యకర్త ఏరుకలి మహేష్ (23) విగ్రహం ముందు గ్రామస్థులతో పాటు కలసి నృత్యం చేస్తుండగా, ఇది మా పార్టీ వినాయకుడు మీరు రావడానికి వీల్లేదు అంటూ అతని పై దాడికి పాల్పడి పిడిగుద్దులు కురిపించారు. 
గాల్లోకి ఎగరేసి కొట్టడం  పక్కనే ఉన్న కంకర రాళ్ళతో కొట్టడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు, మెడలు విరిగి, ఛాతీ ఏముకలు విరిగి ఊపిరితిత్తులకు గాలి అందక మరణించాడు.ఈ దాడిలో దాదాపు 15 మంది టీఆర్ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్పంచ్ వెంకటమ్మ భర్త, మండల రైతు కోఆర్డినేటర్ నర్సింహులు  గౌడ్, ఎమ్మెల్యేల ప్రోద్భలంతో ఈ దాడికి పాల్పడ్డారు, ఆపడానికి వెళ్లిన బీజేపీ నాయకులను, మహేష్ వాళ్ళ అన్నను.  తల్లిని అందరినీ కొట్టారు. గొడవ జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో మహేశ్‌‌ తల్లి మాసమ్మ కొడుకును అక్కడినుంచి తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే వెనక నుంచి కొందరు యువకులు వచ్చి మహేశ్‌‌ను బలవంతంగా ఈడ్చుకు వెళ్లి రాళ్లతో దాడిచేశారు.
 
వెంటనే కుటుంబీకులు భూత్పూర్​లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌‌ తీసుకెళ్లాలని చెప్పారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. 
 
మహేశ్‌‌ కొన్ని రోజులుగా గ్రామంలో జరుగుతున్న పనులపై సర్పంచ్‌‌ భర్త నర్సిములు గౌడ్​ను నిలదీస్తున్నాడు. గ్రామంలో నల్లమట్టిని తరలిస్తుండగా మహేశ్​తో పాటు కొందరు యువకులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలోని దేవాలయం అభివృద్ధి కోసం కొంత డబ్బును సమకూరుస్తామని మాటిచ్చారు. 
 
డబ్బులు ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించాడు. ఇది మనసులో పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు చాలాసార్లు మహేశ్​పై దాడి చేసేందుకు యత్నించారని తల్లి మాసమ్మ ఆరోపించింది. కుటుంబసభ్యులు మహేశ్ ​మృతదేహంతో బుధవారం గ్రామంలో ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని సర్పంచ్ ఇంటి వాకిట్లో గుంత తవ్వి అంత్యక్రియలు చేసేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.  పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 
మహబూబ్ నగర్ ఆర్డీఓ పద్మజా యాదవ్ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. మహేశ్ ​కుటుంబ సభ్యులు, బంధువులు అధికారుల మాటలు వినిపించుకోలేదు. మృతదేహాన్ని సర్పంచ్ ఇంటి ముందే పెట్టి ఆందోళనకు దిగారు. భూత్పూర్ సీఐ రజితా రెడ్డి, ఎస్సై భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
మహేశ్​పై దాడి చేసి హతమార్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్ భర్త  నర్సిములుగౌడ్​తో పాటు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 
తమ పార్టీకి చెందిన కార్యకర్తను అతి దారుణంగా హతమార్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్ కుటుంబసభ్యులకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ముందు బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కుటుంబీకులకు అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు.