దేశంలో 11.8 శాతం పెరిగిన సైబర్‌నేరాలు

నేషనల్‌ క్రైం రికా ర్డ్స్‌ బ్యూరో(ఎన్సీఆర్బీ)-2020 నివేదిక ప్రకారం  2019తో పోలిస్తే దేశంలో సైబర్‌నేరాలు 2020లో 11.8 శాతం పెరిగాయి. కేంద్ర హోంశాఖ విడుదలచేసిన ఈ నివేదిక ప్రకారం 2019లో 44,735 నమోదు కాగా, 2020లో 50,035 నమోదయ్యాయి. 60.2 శాతం సైబర్‌ మోసాలకు సంబంధించిన కేసులే ఉన్నాయి.

రెండోస్థానంలో లైంగిక వేధింపులు (6.6%), మరో 2,440 కేసులో బెదిరింపులకు సం బంధించినవి ఉన్నాయి. మానవ అక్రమ రవాణాకేసులు 2019తో పోలిస్తే 22 శాతం తగ్గుదల నమోదైంది. 2019లో మానవ అక్రమ రవాణా కేసులు 2,208 కేసులు నమోదు కాగా, 2020లో 1,714 కేసులు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 66,01,285 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఐపీసీ సెక్షన్ల కింద 42,54,356 కేసులు, ఇతర సెక్షన్ల కింద 23,46,929 కేసులు నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020లో నేరాల నమోదు శాతంలో 28 శాతం పెరుగుదల కనిపిస్తున్నది.

మహిళలపై నేరాలు స్వల్పంగా తగ్గాయి. 2019 లో 4,05,326 నేరాలు నమోదుకాగా, 2020కి వచ్చేప్పటికి 8.3% తగ్గుదలతో 3,71,503 నమోదయ్యాయి. చిన్నారులపై 2019లో 1,48,090, 2020లో 1,28,531 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన అన్ని నేరాల్లో కలిపి 68,14,614 మందిని 2020లో అరెస్టు చేసినట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.

దేశంలో అత్యధికంగా క్రైంరేట్‌ గుజరాత్‌లో ఉన్నది. తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు ఉన్నాయి. నగరాలపరంగా చూస్తే సూరత్‌, కోయంబత్తూర్‌, అహ్మదాబాద్‌లు అత్యధిక క్రైంరేట్‌ ఉన్న జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

తెలంగాణలో అన్నిరకాల నేరాలు కలిపి 2020 లో 1,47,504 నేరాలు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే ఇది చాలా స్వల్ప పెరుగుదల. మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. 2019లో 18,394 కేసులు వస్తే 2020లో 17,791కి తగ్గాయి. హైదరాబాద్‌లో మహిళలపై పాల్పడిన నేరాల సంఖ్య 2,755 నుంచి 2,390కి తగ్గాయి.

పిల్లలపై నేరాలు 4,212 నుంచి 4,200 కు కేసులు తగ్గాయి. హైదరాబాద్‌లో ఈ సంఖ్య 506 నుంచి 467కు తగ్గింది. 1352 నుంచి 1013కు తగ్గాయి. హైదరాబాద్‌లో 350 నుంచి 172కు కేసులు తగ్గాయి. హత్యల విషయానికి వస్తే దేశం లో 2019లో 28,194 హత్యలు జరుగగా,  2020లో 28,493కు పెరుగగా. తెలంగాణలో మాత్రం 839 నుంచి 802కు తగ్గాయి. హైదరాబాద్‌లో 86 నుంచి 71కు తగ్గాయి.