అధికార పార్టీ మద్దతుదారులు ప్రతిపక్ష పార్టీ బిజెపి మద్దతుదారులపై జరిపిన ప్రతీకార హింసగా కమీషన్ తన తుది నివేదికలో అభివర్ణించింది. హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, అంతేకాదు ఈ విచారణ రాష్ట్రం బయట జరగాలని కూడా స్పష్టం చేసింది.
ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఘనవిజయం సాధించిన కొద్దిసేపటి తర్వాత ప్రస్తావనకు వస్తున్న హత్య, అత్యాచార ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఎన్హెచ్ఆర్సి కమిటీ పేర్కొన్న ఇతర ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి పశ్చిమ బెంగాల్ కేడర్కు చెందిన సీనియర్ అధికారులతో ప్రత్యేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.
ఈ సిట్ లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉంటారు. వారు సౌమెత్ మిత్రా, సుమన్ బాల సాహూ, రణబీర్ కుమార్. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా విచారణలను పర్యవేక్షిస్తారు. దీని గురించి వివరణాత్మక ఉత్తర్వు తరువాత జారీ చేయబడుతుందని కలకత్తా హైకోర్టు తెలిపింది.
దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసుల రికార్డులన్నింటినీ సిబిఐకి వెంటనే అప్పగించాలి. ఇది “కోర్టు పర్యవేక్షణలో జరిగే విచారణ” అని, విచారణ సమయంలో ఎవరైనా అడ్డంకులు ఎదురవుతాయని చెబిది “తీవ్రంగా పరిగణిస్తాము” అని హైకోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికల అనంతరం శాంతిభద్రతలు రాష్ట్రంలో పూర్తిగా దారి తప్పాయని, పలువురు బిజెపి నాయకులు హత్యలకు గురయ్యారని, వేలాదిమంది భయంతో తమ నివాసాలు వదిలి వలస వెళ్లారని రాష్ట్ర బిజెపి నాయకులూ ఆందోళన వ్యక్తం చేశారు. దానితో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నలుగురు సభ్యుల బృందాన్ని ఎన్నికల అనంతర హింసను చూసిన ప్రాంతాలను సందర్శించడానికి నియమించింది.
కలకత్తా హైకోర్టు చివరికి ఈ విషయాన్ని గుర్తించి, హింసకు సంబంధించిన అన్ని కేసులను పరిశీలించాలని జాతీయ మానవహక్కుల కమీషన్ ను కోరింది. ఏడుగురు సభ్యుల కమిటీ తుది నివేదికను జూలై 13 న సమర్పించింది.
ఎన్నికల అనంతరం హింస, అత్యాచారాలు, హత్యలను నిర్ధారిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణను సిఫార్సు చేసింది. అయితే ఈ నివేదిక రాజకీయ ప్రేరేపితం అని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరువాత అఫిడవిట్ దాఖలు చేసింది. సిబిఐ విచారణను వ్యతిరేకించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనలను హైకోర్టు పట్టించుకోలేదు.
More Stories
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్
అగ్నికి ఆజ్యం పోసిన శామ్పిట్రోడా వారసత్వ పన్ను ప్రస్తావన
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు