భారతదేశ ఆత్మగర్వం తన సంప్రదాయ పరిజ్ఞానంలో ఉందని, దానికి ఇతర దేశాలను కాపీ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతి, విద్యా వ్యవస్థల విశిష్టతను వ్యక్తం చేసే ఓం ప్రకాష్ పాండే రాసిన, నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన “భారత్ వైభవ్” గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు.
2018 లో అప్పటి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో సత్య పాల్ మాలిక్ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని ఒక ప్రాజెక్ట్ లాగా ప్రారంభించారు . భారత చారిత్రక పరిశోధన మండలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం తన విజ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచమంతా పంచుకునేందుకు పుట్టిందని చెప్పారు. దేశ సమాచారం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి, విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు.
చైనా, అమెరికా, రష్యా చేసేలా మనం ఎందుకు పనులు చేయలేమని.. తరచూ అడిగేవారని, అయితే, మన పనులను మనం సొంత పద్ధతిలోనే చేసుకోవాలని పేర్కొన్నారు. గత జాతీయ విద్యావిధానం ‘మన సొంత ప్రజల గొప్ప పనుల’పై సరిగా తెలుపలేదని, కొత్త జాతీయ విద్యా విధానం భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు.
‘మన దేశంలో ఏమి బోధించినా.. అది ‘మన ప్రజల గొప్ప పనుల’ను చెప్పకపోతే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. ‘భారత్ వైభవ్’ పుస్తకం దేశ వివిధ కోణాలను, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థ, ప్రాచీన సంస్కృతి, నాగరికత అవసరాన్ని నేటి ప్రపంచానికి అందిస్తుందని మోహన్ భగవత్ తెలిపారు. ‘భారత్ వైభవ్’ పుస్తకం భారతదేశంలోని వివిధ కోణాలను, దాని సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థ, దాని ప్రాచీన సంస్కృతి, నాగరికత, నేటి ప్రపంచానికి దాని అవసరాన్ని అందిస్తుంది.
ఇటీవల వరకు భారతదేశంలో ప్రబలంగా ఉన్న విద్యావ్యవస్థ మూలాలను వెతుకుతూ, బ్రిటిష్ వారు రాజులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ, ఒక భారీ సామ్రాజ్యాన్ని నడిపినప్పటికీ, ప్రజలు ఇప్పటికీ వారికి వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. వాస్తవానికి, “చాలా కులాలు, చాలా భాషలు” ఉన్నప్పటికీ, ప్రజలు వారికి వ్యతిరేకంగా ఉన్నారని, తాము సుదీర్ఘకాలం పాలించినప్పటికీ ప్రజలు తమతో లేరని గ్రహించారని వలస పాలకులు గ్రహించారని భగవత్ తెలిపారు.
“కాబట్టి ఆ తేజస్విత (తేజస్సు) ని ముగించే కుట్ర ద్వారా,” బ్రిటిష్ వారు భారతీయుల ఆత్మగౌరవాన్ని చంపాలని నిర్ణయించుకున్నారని, వారు తమను మరచిపోయే విధంగా చేశారని తెలిపారు.
“స్వీయ గురించి మనకు తెలిసిన ప్రతిదాన్ని మనం మరచిపోయేలా చేయడానికి, వాటిని మనకు గుర్తుచేసే అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. చివరకు మనం ఆయా వ్యవస్థలను నిర్వహించే సామర్థ్యాన్ని కూడా కోల్పోయేవిధంగా చేశారు” అని ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పారు.భారతదేశ ఆర్థిక, విద్యా వ్యవస్థలను బ్రిటిష్ వారు సమాధి చేసారని చెబుతూ బ్రిటిష్ వారు “తమ అభీష్టం మేరకు కల్పిత గ్రంధాలను ప్రచారంలోకి తీసుకు రావడానికి విదేశీయులకు, దురదృష్టవశాత్తు కొంతమంది భారతీయ పండితులకు నగదు చెల్లించేవారు” అని ఆయన తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన మూలాలకు తిరిగి వెళ్లడం మన కర్తవ్యం, అయితే విషయాలు నెమ్మదిగా కదులుతున్నాయని భగవత్ విచారం వ్యక్తం చేశారు. “ఆంగ్లేయులు, వారి విధానం ప్రకారం, మనకు గౌరవం లభించదని మనకు బోధించారు. మన పూర్వీకులు యుద్ధం లేదా సంపదపై ఎలాంటి గౌరవం పొందలేదని వారు మనకు బోధించారు, ” అని ఆయన చెప్పారు.
“ఎవరైనా బయటి నుండి వస్తారు, మిమ్మల్ని కొడతారు. మిమ్మల్ని వారి బానిసలుగా చేస్తారు. మీరు వారు చెప్పిన్నట్లు నడుచుకొంటారు” మన మానసిక స్థితిని బిరిధ్స్ వారు భారతీయులలో పెంపొందించారని భగవత్ వివరించారు.
భారతీయులు తమను తాము, తమ మూలాలను తెలుసుకొనే విధంగా మన విద్య చేయలేక పోయినదని అంటూ “దురదృష్టవశాత్తు, స్వాతంత్య్రం వచ్చిన చాలా కాలం తర్వాత కూడా ఇది కొనసాగుతోంది” అని భగవత్ విచారం వ్యక్తం చేశారు. అయితే నూతన
విద్యా విధానం భారతీయ మూలాల వైపు తిరిగి దృష్టి సారిస్తోంది ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఏ దేశానికైనా నైతికత, ఆత్మవిశ్వాసం దాని సంస్కృతి సహాయంతో మాత్రమే మేల్కొన్నాయని స్పష్టం చేశారు. “భారతీయ సంస్కృతి శాశ్వతమైనది, దానిని మన జీవితాల్లో నింపడానికి , మన భవిష్యత్తు తరాలకు కూడా అందజేయడానికి మన వంతు కృషి చేయడం మన సమిష్టి బాధ్యత” అని ఆయన తెలిపారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!