స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్లాస్టిక్తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించకుండా చూడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
జాతీయ జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీక ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్తో కాకుండా పేపర్తో తయారు చేసిన జెండాలను వాడాలని చెప్పింది. ప్లాస్టిక్ జెండాలు పేపర్ వాటిలా పర్యావరణంలో కలిసిపోవని, అలాగే బయటపడవేయడం సరైంది కాదని పేర్కొంది.
ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002 ప్రకారం పేపర్తో తయారు చేసిన జెండాలు వాడుతారనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది.
‘నేషనల్ హానర్ యాక్ట్, 1971 కు అవమానాల నివారణ చట్టం’ సెక్షన్ 2 ప్రకారం – ఏ బహిరంగ ప్రదేశంలో లేదా ఏ ఇతర ప్రదేశంలోనైనా ప్రజల దృష్టిలో మంటలు, మూర్ఛలు, అపవిత్రతలు, అపవిత్రతలు, నాశనం చేయడం, తొక్కడం లేదా అగౌరవం చూపడం లేదా భారత జాతీయ జెండా లేదా దాని ఏదైనా భాగాన్ని (పదాల ద్వారా, మాటల ద్వారా లేదా వ్రాతల ద్వారా లేదా చర్యల ద్వారా) ధిక్కారం లోకి తీసుకువస్తే, మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటిని విధించవచ్చు.
ప్లాస్టిక్తో తయారు చేసిన జాతీయ జెండాను ఉపయోగించనందుకు విస్తృత ప్రచారం ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో చేయాలని సూచిందింది. రాష్ట్ర ప్రభుత్వాలు, యుటి పరిపాలనలు, అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, భారత ప్రభుత్వ శాఖలు ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002’ మరియు ‘జాతీయ గౌరవం చట్టం, 1971 లో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూసుకోవాలని తెలిపింది.
More Stories
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం
ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీస్
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు