ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పన్ను చెల్లింపు దారులు తమ సమస్యలను తెలిపేందుకు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ మూడు అధికారిక ఈ-మెయిల్ ఐడీలను నోటిఫై చేసింది. ఫేస్లెస్ లేదా ఈ-అసెస్మెంట్ స్కీమ్ కింద ఫిర్యాదులు చేయడానికి వీటిని నోటిఫై చేసినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది.
టాక్స్ పేయర్స్ చార్టర్లో పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఐటీ రిటర్న్స్ మూడు ఈ-మెయిల్ ఐడీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఫేస్లెస్ స్కీం కింద పన్ను చెల్లింపులకు సంబంధించి పెండింగ్ కేసుల పరిష్కారం, ఇతర సమస్యలను ఫిర్యాదు చేసేందుకు ఈ-మెయిల్ ఐడీలను క్రియేట్ చేశాం అని తెలిపింది.
పన్ను చెల్లింపు దారులు ఎదుర్కొనే పలు సమస్యల పరిష్కారానికి “For faceless assessments: samadhan.faceless.assessment@incometax.gov.in; For faceless penalty: samadhan.faceless. penalty @incometax.gov.in; For faceless appeals: samadhan.faceless.appeal@incometax.gov.in, “
అనే ఈ-మెయిల్స్ కు ఫిర్యాదు చేయొచ్చు.
ఫేస్లెస్ అసెస్మెంట్ స్కీం కింద పన్ను చెల్లింపు దారు తమ ఆదాయం పన్ను సంబంధ లావాదేవీలపై చర్చించడానికి, ఫిర్యాదు చేయడానికి ఐటీ శాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు.

More Stories
పెట్టుబడులకు అనుకూలతలో తెలంగాణకు 10వ ర్యాంక్
హార్ముజ్ జలసంధి కాకుండా ఇంధన సరఫరాకు సరికొత్త వ్యూహం!
నీట్-యూజీ 2026 లీక్..రూ.5 లక్షలకే 111 ప్రశ్నలు విక్రయం