హర్యానా రాష్ట్రం నుంచి భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకాలు సాధించి వచ్చే వారిపై ఆ రాష్ట్ర సర్కారు కాసుల వర్షం కురిపించబోతున్నది. పతకాలు సాధించిన వారికేగాక కొద్ది తేడాతో పతకాన్ని చేజార్చుకున్న వారికి కూడా ఈ సారి నగదు ప్రోత్సాహకాలు అందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విషయాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టరే స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఖట్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి వచ్చిన వారికి హర్యానా ప్రభుత్వం రూ.6 కోట్లను ప్రోత్సాహకంగా అందించనున్నది.
అదేవిధంగా రజత పతకం సాధించిన వారికి రూ.4 కోట్లను, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్లను ప్రభుత్వం ప్రోత్సాహక బహుమానంగా ఇవ్వనుంది. అంతేగాక గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పతకాన్ని తృటిలో చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా రూ.50 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నట్టు ఖట్టర్ చెప్పారు.
ఈ నగదు బహుమతులను హర్యానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు మాత్రమే ఇస్తారు. హర్యానా కొత్త క్రీడా విధానం ప్రకారం, ఆటగాళ్ల కోచ్లను సత్కరించడానికి కొత్త నిబంధన జోడించారు. ఇవే కాకుండా, సౌకర్యాలను మెరుగుపర్చడానికి క్రీడా స్టేడియంలో 10 శాతం అదనంగా నిధులు ఇస్తారు.
More Stories
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్
వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
ఇందిరా ఆస్తి పోవద్దనే వారసత్వపు పన్ను రద్దు