ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పథకాన్ని కొద్దిలో చేజార్చుకొంది. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్లో బ్రిటన్ 4-3 గోల్స్ తేడాతో పతకాన్ని సొంతం చేసుకున్నది. తుద వరకు భారత మహిళలు పోరాడినా, ఫోర్త్ క్వార్టర్స్లో చేతులెత్తేశారు. దీంతో ఒలింపిక్స్ హాకీలో చరిత్ర సృష్టించే అద్భుత అవకాశాన్ని మహిళల జట్టు మిస్సైంది.
భారత మహిళల హాకీ జట్టు తృటిలో పతకాన్ని మిస్ చేసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.మహిళల హాకీ జట్టు ప్రదర్శనను ఎన్నటికీ మరువలేమని మోదీ అన్నారు. మ్యాచ్ ఆద్యంతం అత్యుత్తమ ఆటను ప్రదర్శించారని, జట్టులోని ప్రతి ప్లేయర్ అద్భుతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించినట్లు ఆయన కొనియాడారు. భారత జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.
నిజానికి టీమిండియా వుమెన్ స్పూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించింది. తొలి క్వార్టర్లో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. సవితా పూనియా అద్భుతమైన రీతిలో గోల్ పోస్టు వద్ద బ్రిటన్ దూకుడును అడ్డుకున్నది. ఇక సెకండ్ క్వార్టర్లో గోల్స్ వర్షం కురిసింది. బ్రిటన్ రెండు గోల్స్ చేయగా ఇండియన్ వుమెన్ మూడు గోల్స్ చేశారు.
గుర్జిత్ కౌర్ రెండు గోల్స్ చేసింది. మరో ప్లేయర్ వందనా కటారియా తన డ్రాగ్ ఫ్లిక్తో మరో గోల్ను ఇండియాకు అందించింది. దీంతో రెండవ క్వార్టర్లో ఇండియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక మూడవ క్వార్టర్ కూడా ఆసక్తికరంగా సాగింది.
గోల్ పోస్టును టార్గెట్ చేస్తూ దూకుడు ప్రదర్శించిన బ్రిటన్ అమ్మాయిలు ఆ క్వార్టర్లో ఒక గోల్ చేశారు. దీంతో రెండు జట్లు 3-3 గోల్స్తో సమంగా నిలిచాయి. టెన్షన్గా మారిన నాలుగవ క్వార్టర్లో.. బ్రిటన్ వుమెన్ తమ జోరును ప్రదర్శించారు. 48వ నిమిషంలో గ్రేస్ బల్సడన్ గోల్ చేయడంతో బ్రిటన్కు ఆధిక్యం దక్కింది. చివరి క్వార్టర్లో భారత మహిళలు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.
More Stories
ఉక్రెయిన్లో నాలుగు పవర్ ప్లాంట్లు ధ్వంసం
సియాచిన్ గ్లేసియర్ వద్ద చైనా సరికొత్త రాదారి
లండన్ భారత హైకమిషన్పై దాడి నిందితుడి అరెస్ట్