ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల విజయాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన ఆయా మ్యాచుల్లో పీవీ సింధు, భారత హాకీ జట్టు గెలుపొందగా, ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ విజయం సాధించాడు.
భారత ఆర్చర్ అతాను దాస్ ప్రీక్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. రెండుసార్లు గోల్డ్ మెడల్స్ సాధించిన దక్షిణ కొరియా ఆర్చర్పై సంచలన విజయం నమోదుచేశాడు. పురుషుల వ్యక్తిగత విభాగం 1/16 ఎలిమినేషన్స్లో దక్షిణ కొరియా ఆటగాడు ఓ జిన్ హయాక్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 5-6 తేడాతో గెలుపొందాడు.
కాగా, మ్యాచ్ సమయం ముగిసే సరికి ఇరువురి స్కోర్లు సమం కావడంతో షూట్ ఆఫ్ నిర్వహించారు. ఇందులో అతాను దాస్ పైచేయి సాధించి ప్రీక్వార్టర్స్లో ప్రవేశించాడు. దాస్ సతీమణి ఆర్చర్ దీపికా కుమారి ఇప్పటికే మహిళల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్లోకి ప్రవేశించింది. కాగా, అంతకుముందు జరిగిన ఎలిమినేషన్ మ్యాచ్లో చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్పై 4-6 తేడాతో అతాను దాస్ విజయం సాధించాడు.
మరోవంక, పురుషుల హాకీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను భారత జట్టు మట్టికరిపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో 3-1 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. దీంతో గ్రూప్లో తానాడిన నాలుగు మ్యాచుల్లో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ను జపాన్తో ఆడనుంది.
More Stories
వంతెన ప్రమాదంలో భారతీయుల చొరవకు బిడెన్ ప్రశంస
అసాంజెను అమెరికాకు తక్షణమే అప్పగించలేం
అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన