భారత్, అమెరికా మధ్య సంబంధాలతో పోలిస్తే ఇటువంటివి విశ్వవ్యాప్తంగా కొన్ని దేశాలకే పరిమితమైనవని పేర్కొంటూ భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అమెరికా విదేశాంగ విధానంలో అతి ప్రధానమైనదని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ స్పష్టంచేశారు. భారత్-అమెరికా దేశాల బంధం బలమైనదని తెలుపుతూ ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా కీలక భూమిక పోషించగలవని ఆయన భరోసా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వంపట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు చేరుకున్న బ్లింకెన్, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు. కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే కార్యాచరణ, ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం పెంచుకోవడంపై భారత నాయకత్వంతో బ్లింకెన్ చర్చించారు.
కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం భారత దేశానికి అదనంగా 25 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం వల్ల భారత దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత పటిష్టమవుతుందని, తద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ప్రాథమిక స్వేచ్ఛ, మానవ హక్కులను అమెరికా గౌరవిస్తుంది. మేం భారత్ను కూడా ఇదే కోణంలో చూస్తాం. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నది’ అని చెప్పారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా బలగాల మోహరింపు అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు. అలాగే ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల దాడులు, ఇండో-పసిఫిక్, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత పరిస్థితులపై కూడా సమాలోచనలు జరిపారు.
More Stories
దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీలపై ఈసీ వేటు
ఐరోపా వెళ్లే భారతీయులకు వీసా సులభం