కశ్మీర్‌లో ఇమాజ్‌ను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ

దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరొక నిందితుడిని సోమవారం అరెస్ట్‌ చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో పండ్ల వ్యాపారం చేస్తున్న ఇజార్‌ అలియాస్‌ సోనూను    అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు.

ఇజార్‌ స్వస్థలం యూపీలోని షామ్లీ జిల్లాలోని కంద్లా పాక్‌లో ఉన్న ఇక్బాల్‌ ఖాన్‌తో ఇజార్‌కు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఇజార్‌ వద్ద పనిచేసే జహంగీర్‌కు పేలుళ్లతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. దర్భాంగా పేలుళ్ల కేసులో ఇప్పటి వరకూ ఎన్ఐఏ 17 మందిని అరెస్ట్‌ చేసింది.

ఈ కేసులో నిందుతులైన మాలిక్‌ సోదరులతో కలిసి ఇమాజ్‌ దర్భంగా పేలుడుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇటీవల దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు.

ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.