రాజ్కుంద్రాకు చెందిన చాలా వ్యాపారాల్లో శిల్పా భాగస్వామిగా ఉన్నారు. వయాన్ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే వివరాల సేకరణలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. మొత్తం కేసులో శిల్పా ప్రమేయం ఎంత ఉందో తెలుసుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ బృందం ప్రయత్నిస్తున్నదని ఆ వర్గాలు చెప్తున్నాయి.
సంస్థకు చెందిన డబ్బు నుంచి శిల్పాకు ఏమైనా ప్రయోజనం కలిగిందా? అనే విషయాన్ని క్రైమ్ బ్రాంచ్ బృందం పరిశీలిస్తున్నది. ఇవే కాకుండా ‘వయాన్ ఇండస్ట్రీస్’ డైరెక్టర్గా శిల్ప శెట్టి ఎన్ని రోజులు పనిచేశారో కూడా తెలుసుకుంటున్నారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు పోలీసులు మళ్లీ శిల్పను సంప్రదించే అవకాశాలు ఉన్నాయి.
అదేవిధంగా, యాప్ల కోసం డిజిటల్ కంటెంట్ను హోస్ట్ చేసే సర్వర్ నుంచి డాటాను తొలగించిన వ్యక్తి కోసం కూడా దర్యాప్తు బృందం వెతుకుతున్నది. తొలగించిన డాటాను పునరుద్ధరించడానికి ఫోరెన్సిక్ నిపుణుల బృందం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం.
మీడియా నివేదికల ప్రకారం, శిల్పాకు రాజ్కుంద్రా అడల్ట్ యాప్ హాట్షాట్లు, దాని కంటెంట్ గురించి పూర్తిగా తెలుసు. శిల్పా బ్యాంక్ ఖాతాలో ఈ యాప్ నుంచి సంపాదించిన పెద్ద మొత్తాన్ని కుంద్రా చాలాసార్లు వేశాడు. కుంద్రా హాట్షాట్స్ యాప్లో 20 లక్షలకు పైగా చందాదారులు ఉన్నారని ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది.
కుంద్రా చేసిన తప్పుల గురించి సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు శిల్పాపై ఆరోపణలు ఉన్నాయి. కుంద్రాకు చెందిన అడల్డ్ కంటెంట్ సంస్థ ‘కెన్రిన్’లో శిల్పా భాగస్వామిగా ఉన్నారని, చాలా మంది ఈ సినిమాల చిత్రీకరణలో నటించడానికి ముందు శిల్పాతో మాట్లాడినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.
రాజ్ కుంద్ర అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టిని కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం రాత్రి పొద్దుపోయేంత వరకు ప్రశ్నించారు. క్రైమ్ బ్రాంచ్ బృందం ఆమె ఇంటికి చేరుకుని పలు అంశాలపై ప్రశ్నించారు. ఆ సమయంలో రాజ్ కుంద్రను తమ వెంట తీసుకెళ్లారు.
శిల్పాను దాదాపు 6 గంటలపాటు పోలీసులు విచారించారు. తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని, రాజ్ కుంద్ర పేరును బంధువు, వ్యాపార భాగస్వామి అయిన ప్రదీప్ భక్షి దుర్వినియోగం చేశారని విచారణలో పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అడల్ట్ యాప్ గురించి తనకేం తెలియదని, నటిని అయిన తాను ఇతర అమ్మాయిలను ఎలా అశ్లీల చిత్రాల్లో నటించాలని చెప్తానని, ఇది పూర్తిగా అబద్ధమని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
More Stories
కాశ్మీరీ పండిట్లలో `గర్ వాపసీ’ ఆశలు
ఆక్రమిత కాశ్మీర్లో ప్రభుత్వంపై తిరగబడిన ప్రజలపై కాల్పులు
28200 మొబైళ్లు బ్లాక్.. 20 లక్షల నంబర్లు కట్!