తెలంగాణ రాష్ట్ర డి‌జి‌పి ని కలిసిన వి‌హెచ్‌పి ప్రతినిధి బృందం.

గోహత్య నిరోధక చట్టాలు కఠినంగా అమలు చేయండి, గో అక్రమ రవాణా అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టండి ,గో అక్రమ రవాణాదారులకు మరియు గోహంతకులకు కొమ్ముకాస్తున్న ఏఐఏంఇఏం పార్టీ నాయకులపై పిడి యాక్టు నమోదు చేయండి ,గో భక్తులపై వేదింపులు మానుకొండి అని డిమాండ్ చేస్తూ వి‌హెచ్‌పి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం రాష్ట్ర డి‌జి‌పి మహేందర్ రెడ్డి గారిని కలిసి లిఖిత పూర్వక పిర్యాదు చేసింది.

దీనిపై స్పందించిన డి‌జి‌పి తగు చట్టపరమైన చర్యలు చేపడుతానని హామి ఇచ్చారు.

వి‌హెచ్‌పి ప్రతినిధి బృందంలో వి‌హెచ్‌పి రాష్ట్ర అధ్యక్షులు ఏం. రామరాజు, రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, గోరక్షా విభాగ్ సౌత్ ఇండియా ఇంఛార్జ్ టి. యాదగిరిరావు, వి‌హెచ్‌పి రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, వి‌హెచ్‌పి నగర అధ్యక్షులు శ్రీనివాస రాజు, గోరక్షా విభాగం అఖిల భారత అద్యక్షులు జస్మత్ పటేల్, నాయకులు అజేయ్, కేశవ్ సోనీ , మహేష్ తదితరులు పాలొన్నారు .