సైనిక చరిత్రను వర్గీకరించే విధానానికి ఆమోదం

యుద్ధ కార్యకలాపాల చరిత్రల సంకలనం, ప్రచురణపై విధానాన్ని రక్షణ శాఖ రాజనాథ్ సింగ్ ఆమోదించారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని సర్వీసులు,ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, అస్సాం రైఫిల్స్ , ఇండియన్ కోస్ట్ గార్డ్ వంటి సంస్థల యుద్ధ డైరీలు,లెటర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అండ్ ఆపరేషనల్ రికార్డ్ బుక్స్ మొదలైన రికార్డులను సరైన రక్షణ, ఆర్కైవల్ , చరిత్రలను రాయడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ చరిత్ర విభాగానికి బదిలీ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

రికార్డుల వర్గీకరణ బాధ్యత పబ్లిక్ రికార్డ్ యాక్ట్ 1993 పబ్లిక్ రికార్డ్ రూల్స్ 1997 లో పేర్కొన్న విధంగా సంబంధిత సంస్థలపై ఉంటుంది. ఈ విధానం ప్రకారం రికార్డులను సాధారణంగా 25 ఏండ్ల లో వర్గీకరించాలి. 25 ఏండ్లకంటే పాత రికార్డులను ఆర్కైవల్ నిపుణులు అంచనా వేయాలి. 

యుద్ధ,కార్యకలాపాల చరిత్రలను సంకలనం చేసిన తర్వాత నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేయాలి. యుద్ధ కార్యకలాపాల చరిత్రలను సంకలనం చేసేటప్పుడు, ఆమోదం పొందేటప్పుడు , ప్రచురించేటప్పుడు వివిధ విభాగాలతో సమన్వయానికి చరిత్ర విభాగం బాధ్యత వహిస్తుంది. జాయింట్ సెక్రటరీ, ఎంఓడీ నేతృత్వంలోని ఒక కమిటీ రాజ్యాంగాన్ని ఈ విధానం తప్పనిసరి చేస్తుంది.

యుద్ధ కార్యకలాపాల చరిత్రల సంకలనం, ప్రచురణకు సంబంధించి ఈ విధానం స్పష్టమైన గడువును నిర్దేశించింది. యుద్ధ కార్యకలాపాలు పూర్తయిన రెండేళ్లలో ఆయా కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ తరువాత,రికార్డుల సేకరణ,సంకలనం మూడేళ్లలో పూర్తి చేసి, సంబంధిత కమిటీకి అందించాలి.

నేర్చుకున్న పాఠాలను విశ్లేషించడానికి, భవిష్యత్తులో జరిగే తప్పులను నివారించడానికి యుద్ధ రికార్డులను వర్గీకరణపై స్పష్టమైన విధానంతో రాయవలసిన అవసరాన్ని కె. సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ ఎన్ ఎన్ వోహ్రా కమిటీ సిఫార్సు చేసింది. 

కార్గిల్ యుద్ధం తరువాత,జాతీయ భద్రతపై గోమ్ సిఫార్సులు కూడా అధికారిక యుద్ధ చరిత్ర అవసరమని పేర్కొన్నాయి. యుద్ధ చరిత్రలను సకాలంలో ప్రచురించడం వల్ల ప్రజలకు సంఘటనల గురించి ఖచ్చితమైన సమాచారం అందిస్తుంది. అలాగే విద్యా పరిశోధనలకు ప్రామాణికమైన విషయాలు తేసుస్తాయి. వదంతులకు అవకాశం ఉండదు.