వరుసగా రెండో ఏడాది నాగార్జునసాగర్లో 45 టీఎంసీల చొప్పున నీటిని నిల్వ ఉంచి చేతులు దులుపుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆ నీటిని మరుసటి వాటర్ ఇయర్కు క్యారీ ఓవర్ చేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం అర్థించడం, దానికి ఏపీ కొర్రీలు పెట్టడం పరిపాటిగా మారింది.
రాష్ట్ర విభజన తర్వాత చేసుకున్న తాత్కాలిక ఒప్పందం మేరకు రాష్ట్రానికి 299 టీఎంసీల నికర జలాలు దక్కాల్సి ఉంది. కృష్ణా బేసిన్లోని మొత్తం నీటిలో ఏపీ, తెలంగాణ 66 : 34 నిష్పత్తిలో నీటిని వాడుకోవాలి. ఏటా 70 శాతం అంతకన్నా ఎక్కువ నీటినే ఏపీ తరలించుకు పోతుండగా, తెలంగాణ వినియోగం 30 శాతంలోపే ఉంటోంది.
రెండు రాష్ట్రాలైన ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్లో నీటి వినియోగాన్ని కేఆర్ఎంబీ పర్యవేక్షిస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు లెక్కలు పరిశీలిస్తే ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర వినియోగం 200 టీఎంసీలు దాటలేదు.
ఉమ్మడి ఏపీలో తలపెట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన పాలమూరు –- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సకాలంలో పూర్తి చేయకపోవడంతోనే కృష్ణా నీటి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడినట్లు స్పష్టం అవుతున్నది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. ఈ రెండు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే కనీసం 150 టీఎంసీల వరకు నీటిని అదనంగా తీసుకునే అవకాశముంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో జూరాల, దానిపై ఏర్పాటు చేసిన లిఫ్టులు, కల్వకుర్తి, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఏఎమ్మార్ – ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులతోనే నీటిని తీసుకోగలుగుతున్నది. వరుసగా రెండేండ్లు కృష్ణా బేసిన్లో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు ఉప్పొంగాయి. ఆ వరదను కొంతలో కొంత కూడా ఉపయోగించుకో లేకపోయిం
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది