ప్రముఖ జర్నలిస్ట్ స్వప్నదాస్ గుప్తా, ప్రముఖ న్యాయవాది మహేష్ జెట్మలానీ లని కేంద్ర ప్రభుత్వం సిఫార్సుపై రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేట్ చేశారు.
రాజ్యసభ సభ్యుడైన స్వప్నదాస్ గుప్తా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పో
ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలోనే ఆయనను తిరిగి నామినేట్ చేశారు. ఇంకా ఆయనకు మిగిలిఉన్న పదవీకాలం 2022 ఏప్రిల్ 24 వరకు ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు.
అదే విధంగా దిగవంత మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జెట్మలానీ కుమారుడు, ప్రముఖ న్యాయవాది మహేష్ జెట్మలానిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ మహాపాత్ర మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానంలో ఆయనను నామినేట్ చేశారు. మహాపాత్రకు ఇంకా మిగిలి ఉన్న ప్రదవీకాలం 2024 జులై 13 వరకు అయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు.
More Stories
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు