ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నేటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూడాలు తేల్చి చెప్పారు.
జనవరి 2020 నుంచి ఉపకార వేతనం పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నారు. జూడాలకు బీమా సౌకర్యంతోపాటు, తమ కుటుంబ సభ్యులకు నిమ్స్లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా తగ్గుమఖం పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే 28 వరకు కొవిడ్ సేవలు కొనసాగిస్తామని జూడాలు హామీ ఇచ్చారు. అంతకు ముందే ఈ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారంచూపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ
రేవంత్రెడ్డి, కేసీఆర్ వీణా వాణిలాగా అవిభక్త కవలలు