ఉప్పల్ ఎమ్మెల్యే భూ ఆక్రమణపై సిట్టింగ్ జడ్జితో విచారణ 

ఉప్పల్ ఎమ్మెల్యే  భేతి సుభాష్ రెడ్డి  భూ ఆక్రమణపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికార‌ పార్టీ అండ‌తోనే సుభాష్ రెడ్డి భూ ఆక్రమణకు పాల్పడ్డారని,  అడ్డుకునే వారెవ‌రూలేర‌నే ధీమాతోనే ఇలా టీఆర్ఎస్ నాయకులూ రెచ్చిపోతున్నార‌న్నారని ధ్వజమెత్తారు. 
 
ఉప్ప‌ల్ ఎమ్మెల్యేకు అనుకూలంగా పోలీసులు వ్యవరించారని, కేసు నమోదు చేయాలని కోర్టు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నార‌ని విమర్శించారు. పిటిషన్ దారుడు మరోసారి కోర్టుకు వెళ్తే హైకోర్ట్ ఆదేశాల ప్రకారం కేసు నమోదు అయ్యింద‌ని పేర్కొన్నారు. వెంట‌నే పోలీసులు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మార్వో గౌతం కుమార్ లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
 
కేసు నీరుగార్చకుండా చూడాలన్న ప్ర‌భాక‌ర్..ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి సీఎంఓ లో ఉన్న ఉన్నతాధికారుల సహకారం ఉందని ప్రభాకర్ ఆరోపించారు. అందుకే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, సీఎంఓ నుంచే డైరెక్షన్ నడుస్తుందని చెప్పారు. 
 
అందుకే కోర్టు నెల రోజుల కిందే అదేశాలు ఇచ్చినా ఇంకా కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలన మొత్తం కూడా అవినీతి పాలన అయ్యిందని పేర్కొంటూ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని స్పష్టం చేశారు. మళ్లీ  ప్రభుత్వం రాదని తెలిసే ప్రజా ప్రతినిదులు దోచుకోవ‌డం మొద‌లుపెట్టార‌ని దుయ్యబట్టారు.