కాగా ఆనంద్ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. మందుకోసం జనం భారీగా రావడంతో పంపిణీ కష్టతరంగా మారింది. కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి.
కొవిడ్ నేపథ్యంలో జనం పొటెత్తుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మళ్లీ పంపిణీ తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా రేపటి నుంచి సువిశాలామైన మైదానంలో మందు పంపిణీకి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి అధికారులను కోరారు.
ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంకు చెందిన బొరిగి ఆనందయ్య కుటుంబం వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నాడు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పుడది రోజుకు 4-5వేలకు చేరింది.
ఆనంద్ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ. భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి శిష్యుడు, గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశారు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతోపాటు పలువురు మేధావుల దగ్గర సలహాలు కూడా తీసుకున్నారు. కరోనాను కట్టడి చేసే మందును తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు అందించారు.
More Stories
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం
ముద్రగడ కుటుంబంలో చిచ్చు పెట్టలేనన్న జన సేనాని