దళారుల ప్రమేయం లేకుండా రైతుల బ్యాంక్ ఖాతాలలోకి నేరుగా నగదు చెల్లించడం గరిష్ట స్థాయిలో ధన్య సేకరణ జరగడానికి ఒక ప్రధాన కారణం అని పంజాబ్ ఆహార సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ రవి భగత్ చెప్పారు.
“ప్రభుత్వం అనాజ్ ఖరీడ్ పోర్టల్ లో రైతుల పేర్లు నమోదు చేసుకొని, దళారులకు కాకుండా వారి ఖాతాలలోకే నగదు జమ చేసింది…. డిజ్ లాకర్ లో ఒక రైతు అమ్మిన పంటలను కూడా జె ఫారం ద్వారా నమోదు చేసిన మొదటి రాష్ట్రం కూడా పంజాబ్. జె ఫారం కోసం రైతులు దళారులపై ఆధారపడకుండా చేసాము” అని వివరించారు.
నేరుగా కనీస మద్దతు ధరను తమ ఖాతాలకు చెల్లిస్తూ ఉండడంతో రైతులు ఫ్లోర్ మిల్లులకు వెళ్లకుండా మండి లకు గోధుమలను తీసుకు రావడానికి ఒక ప్రధాన కారణం అని భారతీయ కిసాన్ యూనియన్ (దకూండా) నేత జగ్మోహన్ సింగ్ చెప్పారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలతో పాల్గొంటున్న రైతులు సహితం కనీస మద్దతు ధరకు (క్వింటాల్ రూ 1,975) తమ గోధుమలు అమ్ముకోవడం కోసం ముందుకు వచ్చారని పంజాబ్ మండి బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కరోనా కారణంగా మార్కెట్ లో ప్రైవేట్ వ్యక్తులు తక్కువగా ఉండడంతో ఎక్కువ గోధుమలను ప్రభుత్వం మండిలకు తీసుకు వచ్చారని కూడా చెప్పారు.
ఆ విధంగా గోధుమలు అమ్మిన రైతులలో లూథియానా పర్నాథంలోని చక్ కలాన్ ఒకరు. తాను 20 ఎకరాలలో రూ 8 లక్షల పెట్టుబడితో సుమారు 400 క్వింటాల్ గోధుమలు పండించినట్లు చెప్పారు. “నగదు నేరుగా మాకు చేరే పద్ధతి నాకు చాల సంతోషం కలిగించింది. నా మొత్తం పంటను ప్రభుత్వ ఏజెన్సీ లేక్ కనీసం మద్దతు ధరకు అమ్ముకొని, గత ఏడాదికన్నా ఎక్కువ మొత్తం పొందాను” అని తెలిపారు.
పంజాబ్ లో 35 లక్షల హెక్టార్లలో గోధుమలను పంజాబ్ రైతులు ప్రతి ఏడాది 17-18 మిలియన్ టన్నుల చొప్పున పండిస్తున్నారు. వాటిల్లో సుమారు 75 శాతం మండిలకు తీసుకు వస్తున్నారు.
(ది ఇండియన్ ఎక్సప్రెస్ నుండి)
More Stories
ఏపీని అన్ని విధాలా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్’
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
శుక్రవారం రెండో విడత పోలింగ్ కు రంగం సిద్ధం