బ్లాక్‌ ఫంగస్‌ ముందుగా గుర్తించడం ద్వారా అరికట్టవచ్చు 

దేశంపై కరోనాతో పాటు దాని వెనుక మ్యూకోర్‌ మైకోసిస్‌ అలియాస్‌ బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించారు. దీని బారిన పడితే..చనిపోయే ప్రమాదం ఉన్నందన ప్రజల్లో కొత్త ఆందోళన నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్‌ ప్రజలకు  కొన్ని సూచనలిచ్చారు. ముందుగా దీన్ని గుర్తించి…ఎలా అరికట్టాలో సలహానిచ్చారు. 
 
‘అవగాహన, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను ముందుగా గుర్తించడం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చు’ అని తెలిపారు. ఫంగస్‌, లక్షణాలు, ఎవరైనా దీని బారిన పడిన తర్వాత తీసుకోవలసిన నాలుగు చర్యల గురించి ట్విట్టర్లో పంచుకున్నారు.
 
బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటీ?
మ్యూకోర్‌ మైకోసిస్‌ అనేది ఓ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌. దీన్నే బ్లాక్‌ ఫంగస్‌ అంటారు. ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై ప్రభావితమౌతుంది. దీని ద్వారా పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే శక్తిని తగ్గిస్తాయి.
 
రోగికి ఎలా సోకుతుంది?
ఇతర అనారోగ్య సమస్యలతో పాటు వారికోజనల్‌ థెరపీ, షుగర్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఐసియులో ఎక్కువ కాలం ఉన్న వారు ఈ ఫంగస్‌ బారిన పడే అవకాశాలున్నాయి.
 
మూక్యోర్‌ మైకోసిస్‌ లక్షణాలు ఏంటి?
ఫంగస్‌ సోకిన వ్యక్తి కళ్లు నొప్పులు రావడం, కళ్ల చుట్లూ ఎరుపు రంగు సంతరించుకోవడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపు వాంతులు, మెదడు మొద్దు బారడం వంటివి లక్షణాలుగా మంత్రి పేర్కొన్నారు.
 
ఏం చేయాలి, ఏం చేయకూడదు
అయితే అన్ని కేసులను ఫంగస్‌ కేసులుగా పరిగణించకూడదు. ముక్కులు పట్టేసినట్లు అనిపించిన ప్రతి కేసులను…ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గిన కరోనా రోగులను ఈ కేసులుగా చూడకూడదని తెలిపారు.