ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స, ఔషధాల గరిష్ఠ ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సపై తాజా మార్గదర్శకాలను విడుదల చేయాలని సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన విధంగానే వారంలోగా అన్ని జిల్లాల్లోనూ టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఖైదీలు, నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో చెప్పాలని కూడా హైకోర్టు కోరింది. అయితే పెరంబుదూరు నుంచి ఆక్సిజన్ రాకుండా తమిళనాడు అడ్డుకుంటోందని డీహెచ్ శ్రీనివాస రావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి ఆగిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేలా చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు కోరింది. చర్యలు తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలని కేంద్రానికి సూచించింది.
రెండు రోజుల్లో కరోనాపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిపుణుల కమిటీ సమావేశాల వివరాలు తమకు సమర్పించాలని కోరింది. శ్మశాన వాటికలు, సదుపాయాల వివరాలు తమకు తెలపాలని సూచించింది.
శుభకార్యాల్లో 200 మంది, అంత్యక్రియల్లో 50కి మించి పాల్గొనవద్దని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఔషధాల అక్రమ విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని, ఫంక్షన్ హాళ్లు, పార్కులు, మైదానాలలో ఆకస్మిక తనిఖీలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
More Stories
కొండా సురేఖకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక
తెలంగాణాలో రాగల ఐదు రోజులు వడగాలులు
తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలి