తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి, కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను పొడిగించింది. ఈ కర్ఫ్యూ అమలు కోసం జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలను కట్టబెట్టారు.
 
అంతకు ముందు నైట్ కర్ఫ్యూపై తెలంగాణ సర్కార్ కు డెడ్ లైన్ విధించింది హైకోర్టు. 45 నిముషాల్లో ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని లేకపోతే తామే ఆదేశాలు ఇస్తామని తెలిపింది హైకోర్టు. అయితే నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు తెలిపారు ఏజీ. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న హైకోర్టు..24 గంటల సమయంలో కూడా ఇంకా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని సీరియస్ అయ్యింది. 
 
 కర్ఫ్యూ నేటితో ముగుస్తున్నందున తదుపరి తీసుకోబోతున్న చర్యలపై నిన్న హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే నేడు వెల్లడిస్తామని ఏజీ కోర్టుకు తెలపడంతో విచారణను హైకోర్టు నేటికి వాయింది. వేసింది. అయితే నేడు కూడా తమ నిర్ణయాన్ని ప్రభుత్వం కోర్టుకు చెప్పకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. నేటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తోంది.. తదుపరి చర్యలేంటని నిలదీసింది. 24 గంటల సమయంలో కూడా ఇంకా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ పై జీవో ఈ రోజుతో ముగుస్తుందని.. మరి రేపటి నుంచి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందని హైకోర్టు ప్రశ్నించింది.
మే1 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందన్న ఏజీ..ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఇదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు 45 నిముషాలు సమయం ఇస్తున్నామని .. ప్రభుత్వ నిర్ణయం తెలపాలని సర్కార్ ను ఆదేశించింది. పిటీషన్ పాస్ ఓవర్ చేస్తున్నట్లు తెలిపింది హైకోర్టు.