Lieutenant Governor of Delhi Anil Baijal
ఢిల్లీ పరిపాలన బాధ్యతలు లెఫ్టినెంట్ గవర్నరుకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) చట్టం 2021’ని అమలులోకి తీసుకువచ్చింది.
నూతనంగా అమలులోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం ఇకపై ఢిల్లీ ప్రభుత్వం ఇకపై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఏప్రిల్ 27 అర్ధరాత్రి నుండి ఈ చట్టం అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 2021 మార్చి 22న ఈ బిల్లు లోక్సభలో, 24న రాజ్యసభలో ఆమోదముద్ర పడింది.
కరోనా రెండో దశ ఉధృతి సమయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, అమలు పరచడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నకేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Stories
పంజాబ్ లో ఆప్ నేతృత్వంలో అత్యంత అవినీతి ప్రభుత్వం
ఓటర్ జాబితాలో పేరు లేకుంటే పౌరసత్వం కోల్పోయినట్టు కాదు
సక్సెస్ ది స్కూల్లో ‘కల్మా’ వివాదంపై ఎన్హెచ్ఆర్సి నోటీసు