
ఫైనాన్స్ బిల్లులోని సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం ఆధార్ సంఖ్యను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా కోరినపుడు, ఆ వ్యక్తి ఆ విధంగా తన ఆధార్ సంఖ్యను తెలియజేయడంలో విఫలమైతే, గరిష్ఠంగా రూ.1,000 వరకు రుసుమును చెల్లించవలసి ఉంటుంది.
ఈ విధంగా రుసుమును విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ బిల్లులో సెక్షన్ 234హెచ్ను కొత్తగా ప్రవేశపెట్టారు. మార్చి 31నాటికి ఆధార్, పాన్లను తప్పనిసరిగా అనుసంధానం చేయించుకోవాలి. ఆధార్ను మెయింటెయిన్ చేయకపోతే పాన్ పని చేయదు. ఫలితంగా ఎదుర్కొనవలసిన పర్యవసానాలకు అదనంగా ఈ రుసుమును చెల్లించాలి.
రూల్ 114ఏఏఏ ప్రకారం, పాన్ను తెలియజేయాలని ఏ వ్యక్తినైనా అధికారులు కోరినపుడు, ఆ వ్యక్తి పాన్ పనిచేయని స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి తన పాన్ను సమర్పించలేదని పరిగణిస్తారు.
ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం, ఏ వ్యక్తినైనా తన పాన్ను సమర్పించాలని అధికారులు కోరినపుడు, ఆ వ్యక్తి తన పాన్ను సమర్పించకపోయినా, పని చేయని పాన్ను సమర్పించినా, ఆ వ్యక్తి అధిక టీడీఎస్ (మూలంలో పన్ను తగ్గింపు)ను లేదా టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు)ను చెల్లించవలసి ఉంటుంది. ఇన్కం ట్యాక్స్ రిటర్న్ను దాఖలు చేయడం సాధ్యం కాకపోవచ్చు, దాని పర్యవసానాలను ఎదుర్కొనవలసి వస్తుంది.
More Stories
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు
ఎస్బీఐ నికర లాభం రూ.16,891 కోట్లు
త్వరలోనే జీఎస్టీ రేట్లు, శ్లాబ్లు తగ్గింపు