ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవహ్ గా దత్తాత్రేయ హోసబాలే

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తదుపరి సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) గా దత్తాత్రేయ హోసబాలే ఎన్నికయ్యారు. ఆయన దత్తాజీగా పేరొందారు. బెంగుళూరులో జరుగుతున్న అత్యున్నత నిర్ణయాధికార వేదిక అఖిల భారత ప్రతినిధి సభ రెండు రోజుల సమావేశాలలో రెండు రోజు ఈ ఎన్నిక జరిగింది. ఆయన మూడు సంవత్సరాల పాటు ఈ హోదాలో కొనసాగుతారు. 

అయన ప్రస్తుతం ఆర్ ఎస్ ఎస్ సహా సర్ కార్యవహ్ గా 2009 నుండి వ్యవహరిస్తున్నారు. దత్తాత్రేయ హోసబాలే కర్ణాటకలోని షిమోగాలోని సోరాబ్‌లో 1954 డిసెంబర్ 1న జన్మించారు. ఆయన ఆంగ్ల సాహిత్యంలో బెంగళూరు యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. ఆర్ ఎస్ ఎస్ కుటుంభం నుండి వచ్చిన ఆయన 1968 లో ఆర్‌ఎస్‌ఎస్‌లో, తరువాత 1972 లో ఎబివిపిలో చేరారు. 1978 నుండి ఎబివిపి పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు.

1975 నుండి 1977 వరకు ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య  పునరుద్ధరణ కోసం జరిగిన పోరాటంలో చురుకుగా పాల్గొని,  అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మిసా) కింద అరెస్టు అయి 16 నెలల పాటు జైలులో గడిపారు.  అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ అఖిల భారత సంఘటన కార్యదర్శిగా 15 సంవత్సరాల పాటు పనిచేశారు. దత్తాత్రేయ హోసబాలే 2003 నుండి 2009 వరకు ఆర్ఎస్ఎస్ సహా బౌద్ధిక ప్రముఖ్ గా, బౌద్ధిక్ ప్రముఖ్ గా వ్యవహరించారు.

విద్యార్థి దశ నుండే  విద్యా, సాహిత్య కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. కర్ణాటకలోని దాదాపు అందరు ప్రముఖ  రచయితలు, పాత్రికేయులతో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకున్నారు. వారిలో వై.ఎన్. కృష్ణమూర్తి,  గోపాల్ కృష్ణ అడిగా ఉన్నారు. 

అస్సాంలోని గువహతి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్ అండ్ యూత్ లో యువజన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. ఆయన కన్నడ మాసపత్రిక అసీమా వ్యవస్థాపక సంపాదకుడు. ఆయన  కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళం, సంస్కృతం భాషలలో నిష్ణాతులు.

భారతీయ లౌకికవాదం హిందూ వ్యతిరేకి అని ఆయన తన స్పష్టమైన  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, “భారతదేశపు ఆలోచన విషయానికి వస్తే, అలాంటి వివాదం లేదు; విషయం ఏమిటంటే రకరకాల ఆలోచనలు ఉండవచ్చు. ప్రతి దానికి తగిన అవకాశం కానీ అవి పరస్పరం విరుద్ధంగా ఉండనవసరం లేదు” అని భావిస్తున్నారు.

ఆయన ప్రపంచ ఏకత్వానికి చిహ్నంగా ఫుట్‌బాల్‌ను పేర్కొన్నారు.
నాగరికతలు, ఖండాలు, సరిహద్దుల్లో ఆరాధకులు, అభిమానులు,  అనుచరులను కలిగి ఉన్న గొప్ప యూనిఫైయర్ ఫుట్‌బాల్. ఇది యుగాల నుండి ఉంది – ప్రాచీన భారతదేశంలో, పురాతన గ్రీస్‌లో మాదిరిగా బంతిని పాదంతో కొట్టడం పాలకులు, సామాన్యులు కూడా పాల్గొనే చాలా ప్రజాదరణ పొందిన క్రీడ అంటూ ఒకసారి పేర్కొన్నారు.

విస్తృతంగా ప్రయాణించిన హోసాబలే అమెరికా, యుకె లలో  హిందూ స్వయంసేవక్ సంఘ్ సంస్థాగత కార్యకలాపాలను పర్యవేక్షించారు. లాభాపేక్ష లేని పరిశోధన సంస్థ ఇండియా పాలసీ ఫౌండేషన్ కు వ్యవస్థాపక ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.