
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) హైకోర్టును అభ్యర్థించింది. న్యాయస్థానం జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులతో విచారణ ముందుకు సాగడం లేదని పేర్కొంది.
గతంలో ఫామ్-10 లేని ఏకగ్రీవ అభ్యర్థులంతా గత శుక్రవారం కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఫామ్-10 తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా గత ఏడాది మార్చిలో నామినేషన్లు వేయని వారు, వేధింపుల కారణంగా ఉపసంహరించుకున్నవారు, వివిధ రాజకీయ పార్టీలు, వర్గాలు ఇప్పటికీ ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలిపింది.
వీటిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అయితే ఏకగ్రీవాల పై విచారణకు ఆదేశించే అధికారం ఎస్ఈసీకి లేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదించారు. ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేశాకే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఇరు పక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులు ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే సోమవారాని(1వ తేదీ)కివాయిదా వేశారు. మధ్యంతర ఉత్తర్వులను కూడా పొడిగిస్తూ మంగళవార ఉత్తర్వులు జారీ చేశారు.
More Stories
డిల్లీ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ పది రెట్లు పెద్దది
కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు
షేర్ల బదిలీపై జగన్, భారతి ఆరోపణలు ఖండించిన విజయమ్మ