ప్రభుత్వం ప్రకటించిన అంచనాల ప్రకారం భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం వ్యయ ప్రణాళికను కొనసాగిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఓ ప్రైవేట్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చినాటికి ద్రవ్య లోటు జీడీపీలో 7.25 శాతం ఉండవచ్చు, దీనిని 3.4 శాతానికి పరిమితం చేయాలని అంతకుముందు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన సవాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయినవారికి ఉపాధి అవకాశాలను సృష్టించడమేనని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు రుణాత్మకంగా ఉంది. దీనికి కరోనా లాక్డౌన్ కారణమని, దీని వల్ల ఒక్క ఇండియానే కాకుండా అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంపై కరోనా వైరస్ ప్రభావం పడలేదు. అన్ని రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. కాంటాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతుల క్షీణత ఆర్థికవృద్ధిని బాగాప్రభావితం చేశాయి.
అయితే ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రానున్న రెండేళ్ళలో వేగంగా దేశీయ ఆర్థికవ్యవస్థ పుంజుకోనుంది. 17 సంవత్సరాల్లో తొలిసారిగా 2021 ఏడాదిలో జీడీపీలో కరెంట్ ఖాతా మిగులు 2 శాతంగా ఉంటుంది. నిరుపేదలను పేదరికం నుంచి బయట పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికవృద్ధిపై దృష్టి పెట్టాలని కోరింది.
కరోనా నేపథ్యంలో హెల్త్ కేర్ రంగంపై మరింత దృష్టి కేంద్రీ కరించాల్సి ఉందని సర్వే సూచించింది. అలాగే చురుకైన కౌంటర్ సైక్లికల్ ఫిస్కల్ పాలసీలకు పిలుపు నిచ్చింది. ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో రాజులకాలంనాటి పురాతన మార్గాలను ఉదాహరించింది. వినియోగాన్ని భారీగా పెంచాలని సాధారణ సంవత్సరాలతో పోలిస్తే మాంద్యం సమయంలో, మెండైన ఉపాధి అవకాశాల కల్పనతోపాటు, ప్రైవేటు రంగం ఆర్ధిక సంపదను మెరుగుపర్చడాకి కృషి చేయాలని శుక్రవారం విడుదల చేసిన సర్వే సిఫారసు చేసింది.
More Stories
చాబహార్ పోర్ట్పై భారత్ – ఇరాన్ ల మధ్య చారిత్రక ఒప్పందం
ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్.. 80 శాతానికి చేరువలో ఓటింగ్
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత