కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోనే సుమారు రెండు కోట్ల ఇళ్లను నిర్మించామని, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 1.25 కోట్ల ఇళ్లను ఇప్పటికే ప్రజలకు అందజేశామని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అందులో 1.50 లక్షల ఇళ్లు కేవలం కేంద్ర ప్రభుత్వమే కట్టిందని మోదీ తెలిపారు.
ప్రధానమంత్రి అవాస్ యోజన కింద లబ్ధి పొందుతున్న దాదాపు 6.1 లక్ష మంది లబ్ధిదారులకు రూ 2691 కోట్ల నిధులను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ విషయంలో గత ప్రభుత్వాల ధోరణి చూశామని గుర్తు చేశారు.
ముఖ్యంగా యూపీని పాలించిన గత ప్రభుత్వాల ధోరణిని చూశామని, ఆ ప్రభుత్వాలను ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదని తెలిపారు. ఇళ్ల నిర్మాణ విషయంలో గత ప్రభుత్వాలు పేదలకు ఏమాత్రం సహాయ సహకారాలను అందించలేదని ధ్వజమెత్తారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చి కేంద్రం మంచి పని చేసిందని చెబుతూ ఇప్పుడు పేదల కోసం ఇళ్లను ఇచ్చి మరింత మంచి పని చేసిందని తెలిపారు. పేదలకు పక్కా ఇళ్లు అందివ్వడమే తమ లక్ష్యమని మోదీ ప్రకటించారు.
More Stories
కాంగ్రెస్ పార్టీకి రూ.1823 కోట్ల ఐటీ నోటీసు
డబ్బులేకే పోటీ చేయడం లేదు .. నిర్మలా
కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం