
దేవాలయాల ఆదాయాల్లో కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్), అదేవిధంగా ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ (ఈఏఎఫ్) కింద 17శాతం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని, ఆ నిధులతోనే దేవాలయాల భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియోలో ‘‘రాష్ట్రంలో భౌతిక, శాసన, పాలనాపరమైన మూడు రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. అసెంబ్లీలో బిల్లు నెంబరు 2/2020 ద్వారా భారీ ఆదాయాలున్న టీటీడీ సహా 9 ఆలయాల ట్రస్టీలపై పర్యవేక్షణను తొలగించారు. దీంతో ఆయా ట్రస్టీల్లో ఎవరు ఏం చేస్తున్నారు?” అంటూ ప్రశ్నించారు.
జైల్లో ఉన్నవారు, బెయిల్పై ఉన్నవారిని ఆలయాలకు చైర్మన్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. ఇక, సింహాచలం భూముల్లో 500 ఎకరాలు తీసుకుని, వేరే చోట ఇస్తారట. ఇక్కడి భూములకు అక్కడి భూములకు తేడా ఏంటి? అనేది ఎవరికీ చెప్పరని దుయ్యబట్టారు.
ఇదంతా లూటీగా కనిపిస్తున్నదని అశోకగజపతిరాజు విమర్శించారు. దేవదాయ మంత్రి నోటి నుంచి బూతులు తప్ప మంచి మాటలు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఆలయాల ఆస్తులను దోచేయాలని క్రమపద్ధతిలో వ్యవహరిస్తున్నవారికి ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలని మాజీ కేంద్ర మంత్రి పిలుపిచ్చారు.
More Stories
ఎసిబి న్యాయమూర్తిపై ట్రోలింగ్ …విచారణకు ఆదేశించిన రాష్ట్రపతి
నేడు ఏపీ సిఐడి కస్టడీకి చంద్రబాబు నాయుడు
కళాజాతాల కోసం కళాకారుల నుండి దరఖాస్తుల ఆహ్వానం