ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం నాడు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, పాలకమండలి ఏర్పాటు చేయాలనే ఎజెండాతో నిరసన తెలియజేశారు.
ముందుగానే పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎన్నికలు జరిగి, గెలిచిన తర్వాత ఇంతవరకు కార్పొరేటర్లగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాము గెలిచినా తమ నియోజక వర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని, ఇంకా పాత కార్పొరేటర్లే అధికారం చెలాయిస్తున్నారని బీజేకీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ఎన్నుకుంటే , ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచాము…ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి మేము అంటూ మండిపడ్డారు. తమని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, తామే ఏమన్నా రౌడీలమా అంటూ కార్పొరేటర్లు ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంతకుముందు బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో సమావేశం నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
చిక్కుల్లో వినోద్ కుమార్ నామినేషన్