ఏపీలో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని స్పష్టం చేశారు.
యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఆమె కుమారుడికి పరీక్షలు జరపగా నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. ఆమె ఫస్ట్ క్లాస్ బోగీలో వచ్చినందున మిగిలిన వారితో కాంటాక్టయ్యే సందర్భాలు తక్కువేనని స్పష్టం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మహిళ నమూనాలు సేకరించి పుణె ల్యాబ్కు పంపామని, ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు
కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నందున ప్రజలెవరూ భయాందోళనకు గురి కావొద్దని భరోసా ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల్లోని ఎయిర్పోర్టుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విమానాశ్రయాల్లో ప్రత్యేక బృందాలు నియమించామని ఆళ్ల నాని చెప్పారు.
మరోవైపు కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలను అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్రిటన్లో కరోనా కొత్త రకం వైరస్ విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణికుల రాకపోకలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
More Stories
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు బాలికకు మొదటి స్థానం
66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
పోస్టల్ బ్యాలెట్ కు 26 వరకు పొడిగింపు