బ్రిటన్లో కరోనా నూతన స్ట్రెయిన్ జూలు విదల్చడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రివేళ కర్ఫ్యూ విధించింది.
డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకూ మహారాష్ట్రలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనున్నట్లు ఉద్ధవ్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు తెలిపింది.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మహారాష్ట్రలోని పట్టణాలు, నగరాల్లో యువత పెద్ద ఎత్తున గుంపులుగా చేరే అవకాశం ఉందని అదే జరిగితే కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు మంగళవారం నుంచి తప్పనిసరి సంస్థాగత క్వారంటైన్కు వెళ్లాలని స్పష్టం చేసింది.
ఆదివారం నాడే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రంలో కరోనాను నియంత్రించడానికి రాత్రి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మహారాష్ట్రలోనూ, దాని రాజధాని ముంబైలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
More Stories
దక్షణాదిన భారీ వర్షాలు.. ఉత్తరాదిన వడగాల్పులు
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు