పాకిస్థాన్, చైనా, మయన్మార్, ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, నార్త్ కొరియా, సౌదీ అరేబియా, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్ దేశాలు మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు వీటితో కూడిన ఒక జాబితాను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తాజాగా విడుదల చేశారు.
‘‘ఇప్పటి వరకూ ఈ జాబితాలో ఉన్న సూడన్, ఉజ్బెకిస్థాన్ దేశాలను ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన జాబితా (ఎ్సడబ్ల్యూఎల్) నుంచి తొలగించాం. ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మత స్వేచ్ఛ విషయంలో అద్భుతమైన ప్రగతిని సాధించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచాయి” అని తెలిపారు.
కాగా, కొమొరొస్, క్యూబా, నికరాగువా, రష్యాలను ఎస్డబ్ల్యూఎల్లో చేరుస్తున్నామని చెప్పారు. ఆల్-షబాబ్, ఆల్ఖైదా, బోకో హరాం, హయత్ తహ్రీర్ అల్-షామ్, హౌతీ, ఐసిస్, ఐసి్స-గ్రేటర్ సహారా, ఐసి్స-పశ్చిమాఫ్రికా, జమాత్ నసర్ అల్-ఇస్లాం వల్ ముస్లిమిన్, తాలిబన్ ఉగ్రసంస్థలను ఆందోళనకర సంస్థలుగా గుర్తిస్తున్నామని పాంపియో వెల్లడించారు.
అమెరికా నిర్ణయం పట్ల యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ హర్షం వ్యక్తం చేసింది.
More Stories
ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ టీకా ఉపసంహరణ
రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి పుతిన్ బాధ్యతలు స్వీకారం
టీ20 ప్రపంచకప్కు ఉగ్రముప్పు!