భారత్ ప్రతిష్ట దిగజార్చే కుట్రలో దేశీయ క్రైస్తవ సంస్థలు

సాధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన అంశాలను సాకుగా చూపి, ఇతర దేశ వ్యవస్థలతో చేతులు కలిపి, దేశప్రతిష్టకు భంగం కలిగించేందుకు, దేశ సార్వభౌమాధికారాన్ని విఘాతం కలిగించేందుకు దేశంలోని ఓ క్రైస్తవ సంస్థ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ విశ్లేషనాత్మక పరిశోధనలో బయటపెట్టింది.

దీనికి ముందు మనం అమెరికా ప్రభుత్వరంగ సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (USCIRF) గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచంలో అన్ని దేశాలలో మతపరంగా మైనారిటీలుగా ఉన్న ప్రజల, మరీ ముఖ్యంగా క్రైస్తవుల సామజిక, ఆర్ధిక, సాంఘిక స్థితిగతులపై, వారి భద్రతపై అధ్యయనం చేసి, ఆయాదేశాలు ఆ మైనారిటీలకు ఎంత శ్రేయష్కరం అనే విషయమై నివేదికలు ప్రచురించడం, దేశాలకు ర్యాంకింగులు ఇవ్వడం పనిగా పెట్టుకున్న సంస్థ ఇది. ఈ అమెరికన్ ప్రభుత్వ సంస్థ ఇటీవల తమ నివేదికలో భారతదేశాన్ని “మతపరమైన మైనారిటీలకు ప్రమాదకరంగా ఉన్న దేశాల్లో 15వ స్థానం” అని ప్రకటించింది. దీన్నేCountries of Particular Concern (CPC)గా వ్యవహరిస్తుంది. ఈ దేశాల జాబితాలో భారత్ ముందు స్థానాల్లో బర్మా, చైనా, ఇరాక్, ఉత్తర కొరియా, పాకిస్థాన్ తదితర దేశాలున్నాయి. భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా క్రైస్తవులపై మెజారిటీ హిందువులు అకారణంగా దాడులకు పాల్పడటం, క్రెస్తవ ప్రచారానికి అడ్డుపడటం, క్రైస్తవులు ఆచారవ్యవహారాలు పాటిస్తున్నందుకు చంపేయడం, మారణహోమం సృష్టించడం, మానవహక్కులు కాలరాయడం వంటివి చేస్తున్నారనేది ఈ అమెరికన్ సంస్థ ఆరోపణ. తమ ఆరోపణలకు మద్దతుగా భాగంగా ఈ సంస్థ ప్రతియేటా వెలువరించే వార్షిక నివేదికలో, మన దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగే కొట్లాటలు, హత్య, ఊరి తగాదాలు, కుటుంబ తగాదాలను వంటి ఘటనలు ఉటంకిస్తూ, ఎక్కడైతే గాయపడ్డవారు మైనారిటీలు, నిందితులు మెజారిటీ మతస్థులుగా ఉంటారో కేవలం ఆ ఘటనలు ఉదాహరణలుగా చూపిస్తుంది.

ఇప్పుడు భారతదేశం కేంద్రంగా పనిచేస్తున్న మరొక క్రైస్తవ సంస్థ గురించి తెలుసుకుందాం.. ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ (Persecution Relief) – ఈ పేరుకు అర్ధం ‘హింస నుండి స్వాంత్వన’ చేకూర్చటం. మెజారిటీ మతస్థుల మతపరమైన హింసలో బాధితులుగా మారుతున్న దేశంలోని క్రైస్తవులకు స్వాంత్వన చేకూర్చడం ప్రధాన ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్టు చెప్పుకుంటుంది.

దేశంలోని మతపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత క్రైస్తవుల కోసం పోరాటం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ, దేశంలోని ఏ మూలన అయినా మెజారిటీ హిందువులు క్రైస్తవులపై అకారణంగా దాడులు జరిపితే వాటిని బహిర్గతం చేస్తాం, బాధితుల తరఫున పోర్టాటం చేస్తాం అని ప్రచారం చేసుకుంటుంది. దీని ప్రధానమైన పని ఏమిటంటే.. దేశంలో ఎక్కడైనా, ఏదైనా కారణం వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య, ఏదైనా సమస్య కారణంగా ఊరిలోని ప్రజల మధ్య, కుటుంబ  సభ్యుల మధ్య జరిగే కొట్లాటలు, హత్యలు వంటి సంఘటనల్లో క్రైస్తవులు ఎవరైనా బాధితులుగా ఉన్నారా అనేది ముందుగా సరిచూసుకుంటుంది. ఒకవేళ దాడిలో గాయపనివారిలో క్రైస్తవులు, నిందితుల్లో హిందువులు ఉన్నట్లైతే అటువంటి ఘటనలను ఒక క్రమపద్ధతిలో పొందుపరిచి రిపోర్ట్ రూపంలోకి తీసుకొస్తుంది. చివరిగా ఆ రిపోర్ట్ అమెరికాలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన USCIRFకు చేరవేస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా అమెరికన్ సంస్థ భారతదేశం మీద ఆంక్షలు విధించాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.

తాజాగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఈ పెర్సిక్యూషన్ రిలీఫ్ అమెరికన్ క్రైస్తవ సంస్థలకు సమర్పిస్తున్న నివేదికలపై దృష్టిసారించింది. నివేదికలో పొందుపరుస్తున్న ‘క్రైస్తవులపై మతపరమైన దాడులలో నిజానిజాలు ఎంతమేరకు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేసింది.

పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న ఘటనల్లో నుండి బాధితులు మరణించిన 8 కేసుల మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యయనం చేసింది. వాటి క్షుణ్ణంగా పరిశీలిస్తే తేలిన విషయం ఏమిటంటే.. ఆ ఎనిమిది కేసులలలో ఎలాంటి మతపరమైన అంశాలూ లేవు. కేవలం బాధితులు మాత్రం క్రైస్తవ మతానికి చెందిన వారు. దీన్ని అదనుగా చూపించి, దేశంలో క్రైస్తవుల మీద హిందువులు హింసాయుత సంఘటనలకు పాల్పడుతున్నారంటూ ఇక్కడి పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ అమెరికాలోని పలు క్రైస్తవ మిషనరీ సంస్థలతో పాటు, లాబీయింగ్ గ్రూపులకు, USCIRFకు నివేదిక పంపడం, ఇటువంటి తప్పుడు నివేదికల ఆధారాంగా భారతదేశాన్ని “మైనారిటీలకు ప్రమాదకరమైన దేశాల” జాబితాలో చేర్చడం వంటి విషయాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. తక్షణమే పెర్సిక్యూషన్ రిలీఫ్ పేర్కొంటున్న కేసుల్లోని నిజానిజాలపై దర్యాప్తు చేసి, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.

పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న అవాస్తవాలలోని కొన్ని ఘటనలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోంశాఖకు వివరించింది.
1. ఓడిశాలోని గిరిజన ప్రాంతంలో చేతబడి నెపంతో యువకుడి హత్య 
ఓడిశాలోని మల్కన్-గిరి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో చేతబడి నెపంతో 18 ఏళ్ల యువకుడిని స్థానికులు హత్యచేశారు. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక కధనం ప్రకారం..  ఘటన అనంతరం పోలీసులు యువకుడి శరీర అవయవాలు ఘటనా స్థలం నుండి వెలికితీశారు. ఘటనలో నిందితులంతా ఒకే గిరిజన గ్రామానికి చెందిన వారు. అంతే కాదు, వారిలో కొందరు మృతుడికి బంధువులు కూడా ఉన్నారు.
ఇదే ఘటనను “ఎవాంజెలికల్ ఫోకస్’ అనే క్రైస్తవ వెబ్సైట్ దీనికి మతం రంగు పులిమి  “16 ఏళ్ల క్రైస్తవ బాలుడిని హిందువులు కొట్టి చంపేశారు” అనే శీర్షికతో ప్రచురించింది.
దీన్ని పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో “14ఏళ్ల బాలుడు మత ఛాందసవాదులు చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు” అని రాసింది.
చేతబడి కారణంగా గ్రామంలో కొందరు చేసిన హత్యకు మతం రంగు పులిమింది.
2. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సహదేవ్ సామ్రాట్ అనే వ్యక్తి హత్య:
బీజాపూర్ జిల్లా తోతాపరా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహదేవ్ సామ్రాట్(30) పెళ్ళికి వెళ్లివస్తుండగా భైరంగర్హ్ పట్టణంలోని కోస్టాపరా గ్రామంలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు అని ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
నిజానికి నక్సలైట్లు ఎవరినైనా హత్యచేసినప్పుడు ఎందుకు హత్యచేస్తున్నామో వివరిస్తూ ఘటనా స్థలంలో ఒక లేఖ వదిలిపెట్టి వెళతారు. కానీ ఇక్కడ హత్యజరిగిన ప్రదేశంలో అలాంటి  లేఖ ఏదీ లేదు. కాబట్టి ఇది నక్సలైట్ల చర్య కాదు, మరే ఇతర కుటుంబ కారణాలు అయివుండొచ్చు అని పోలీసులు భావించారు.
అనంతరం న్యూస్ 18 వార్తా కథనం ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి భార్య బ్రతికుండగానే మరో వివాహం చేసుకున్నాడని, దీనిపై కుటుంబంలో చెలరేగిన తగాదాల వల్ల జరిగిన గొడవలో అతడు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని బయటపెట్టింది.
కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ మాత్రం తమ నివేదికలో.. “48 ఏళ్ల సహదేవ్ సామ్రాట్ అనే గిరిజనుడు క్రైస్తవం స్వీకరించినందుకు పోలీస్ ఇంఫార్మర్ నెపంతో నక్సలైట్లు చంపేశారు” అని రాసింది.
క్రైస్తవం తీసుకున్నందుకు నక్సలైట్లు చంపడం అనే ఘటన భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు.
3. ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ హత్య

ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ అనే వ్య‌క్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు హ‌త‌మార్చారు. అయితే స‌బ్రాంగ్ అనే వామ‌ప‌క్షమీడియా పోర్ట‌ల్ “రామ్ గోండ్ అనే వ్యక్తి క్రైస్త‌వ మతం స్వీకరించినందున త‌ల న‌రికి చంపేశారు” అని ప్రచురించింది. పైగా హిందూ మతోన్మాదులే స్వయంగా నక్సలైట్లకు ఆయుధాలు అందించి ఈ హత్య చేయించారు” అని రాసింది. అంతేకాకుండా నిందితులైన హిందువులను రక్షించడం కోసం పోలీసులు ఈ హత్యలో నక్సలైట్ల పాత్రను ఖండించార‌ని కూడా ఆ కధనంలో పేర్కొంది.

పైన పేర్కొన్న కధనమనే నిజమైతే, నక్సలైట్ చరిత్రలో వారు తమ మాజీ సహచరులలో ఒకరిని చంపడానికి హిందువుల నుంచి  ఆయుధాలు తీసుకున్న మొదటి ఘటన ఇదే అవుతుంది.  దీనిపై ఆసియా న్యూస్‌ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన పెర్సిక్యూషన్ రిలీఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షిబు థామస్.. అనంత్ రామ్ గోండ్ 9నెలల క్రితం క్రైస్తవ మతంలోకి మారాడ‌ని, రెండు నెలల క్రితం బాప్టిజం పొందాడ‌ని, దీంతో ఆ గ్రామంలో హిందువులు అత‌నిపై కోపంతో చంపేశార‌ని, పైగా న‌క్స‌లైట్ల చంపేశార‌ని చెబుతున్నార‌ని” చెప్పాడు.

సబ్రాంగ్, పెర్సిక్యూషన్ రిలీఫ్ చెబుతున్న విష‌యాల్లో చాలా అవాస్త‌వాలున్నాయి. త‌మ రహస్యాలను పోలీసులకు చెబుతార‌నే భయంతో బాధితుడు అనంత్ రామ్ గోండ్‌ను నక్సలైట్‌లు చంపారని మరోపక్క ఇదే పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ స్వంత ఫేస్‌బుక్ పోస్టులో స్పష్టంగా రాసింది.
 

4: ఛత్తీస్‌గ‌ఢ్‌లో ముంగ్లు రామ్ నరేటి అనే వ్య‌క్తి హత్య

ఛత్తీస్‌గడ్‌లోని కోహ్కమెట గ్రామానికి చెందిన ముంగ్లు రామ్ నురేటి అనే వ్యక్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు చంపేశారు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ హిందువులపై నింద‌లు వేయ‌డానికి సిద్ధమైంది.
“ముంగ్లు రామ్ నురేటి  క్రైస్తవ మ‌తాన్నిపాటించడాన్ని వ్యతిరేకించిన గ్రామస్తులు అతన్ని మావోయిస్టులకు పోలీసు ఇన్ఫార్మర్‌గా తప్పుగా నివేదించారు. మూడేండ్ల క్రితం జంతు భావ‌జాలం క‌లిగిన గిరిజ‌న తెగ నుంచి ఆయ‌న క్రైస్త‌వంలోకి వ‌చ్చాడు” అంటూ  పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2019 వార్షిక నివేదికలో పేర్కొంది. గిరిజన మత విశ్వాసాలను “జంతు భావాజాలం క‌లిగిన ” అని అవమానకరమైన సూచనను ఈ నివేధిక‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు.
ఈ కేసులో బాధితుడి కుమార్తె ఇచ్చిన వాఙమూలం అత్యంత కీలకమైనది. మృతుడి కుమార్తె దివ్య మాట్లాడుతూ  “నా తండ్రి ఇన్ఫార్మర్ కాదు. అతను ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న సాధారణ వ్యక్తి. పోలీసులు, నక్సలైట్టు  ఇద్దరూ మా గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడతారు. గ్రామస్తులు వారిలో ఎవరికైనా సమాచారం ఇచ్చేవారని దీని అర్థం కాదు” అని తెలిపింది.
5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుబ్బరవమ్మ అనే వృద్ధురాలి హత్య:

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక వృద్ధురాలిని యువకుడు హతమార్చాడు. తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  కానీ ఈ వార్తలను పెర్సిక్యూషన్ రిలీఫ్ వక్రీకరించింది.  పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2018 వార్ష‌క నివేదిక‌లో ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. “హిందూ దేవాలయ పూజారి, గ్రామ సర్పంచ్ యొక్క ప్రేరణతో వృద్ధురాలు చంప‌బ‌డింది” అని పేర్కొంది. ఇది పోలీసు నివేదిక‌ల‌కు పూర్తి విరుద్ధం.
ఇదే కేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల శిల్పిని అరెస్టు చేసినట్లు, నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు ఆ జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. ఈ విషయమై ఎస్పీ మాట్లాడుతూ..  “అతను రోజూ ప్రాంతంలోని ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడని, నేరం జరిగిన రోజు అతను.. యువ‌తి అనుకుని వృద్ధురాలు ఉండే గ‌దిలోకి వెళ్లాడు.  అతను ఆమెను బ‌ల‌వంతం చేయగా ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆ వృద్దురాలి త‌ల‌పై క‌ర్ర‌తో  కొట్టాడు. తీవ్ర గాయాల‌తో ఆమె మ‌ర‌ణించింది. అనంత‌రం విశాఖపట్నంలోని ఒక ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకుంటున్న అత‌న్నిమార్చి 23 న మేము అతన్ని అదుపులోకి తీసుకున్నాము. ” అని ఎస్సీ వెల్ల‌డించారు. “ఎఫ్ఐఆర్లో నిందితుల పేరు ప్రస్తావించలేము. ఎందుకంటే, నేరం జరిగిన సమయంలో, అతను ఆమెను చంపాడని మేము నిర్ధారించలేదు. ఈ కేసులో మతపరమైన కోణం లేదు. నిందితుడు మానసికంగా  రోగి,  పైగా లైంగిక‌దాడి పాల్ప‌డంతో ఆమె ప్ర‌తి ఘ‌టించ‌డంతో ఆమెను కొట్టాడు” అని ఎస్సీ స్పష్టం చేసారు.
6: తమిళనాడులో పాస్టర్ గిడియాన్ పెరియసామి హత్య

త‌మిళ‌నాడులోని గిడియాన్ అనే ఒక క్రైస్తవ పాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌నను పెర్సిక్యూషన్ రిలీఫ్,  ఇతర క్రైస్తవ సంస్థలు ‘క్రూరమైన హత్య’ అని వక్రీకరించాయి. తమిళ దినపత్రిక దినమలార్ దీనిని ఆత్మహత్య కేసుగా నివేదించింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇదీ ఆత్మహత్యే అని నివేదించింది. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ‘మెజారిటీ మతస్థులు దారుణంగా కొట్టి, హింసించి హ‌త్య చేశార‌ని’ త‌న నివేదిక‌లో పేర్కొంది.
అంతే కాకుండా సంఘటన జరిగిన 2 రోజుల్లోనే www.change.org సైట్‌లో హిందూ సంస్థలు,  వ్యక్తులపై బలమైన ఆరోపణలతో ఆన్‌లైన్ పిటిషన్ తయారు చేయబడింది. ఇందులో ‘క్రిస్టియన్ మైనారిటీ, దళిత పాస్టర్ మిస్టర్ గిడియాన్ పెరియసామిని 2018 జ‌న‌వ‌రి 20న హత్య చేశార‌ని, అందులో నలుగురు నిందితులు హిందూ మున్నాని, ఉన్న‌త కులాల‌కు చెందిన హిందూ మతోన్మాదులని” పిటిష‌న్‌లో  పేర్కొంది. మరణించిన పాస్టర్ మిస్టర్ గిడియాన్ పెరియసామి గురించి తమిళంలో 25 నిమిషాల నిడివి గల వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.  ఇందులో గ్రాహం స్టెయిన్స్ చిత్రం, అతని హత్య కథనం యొక్క దృశ్యాలతో వీడియో రూపొందించారు. అతని అంత్యక్రియల‌తో పాటు గ‌తంలో జ‌రిగిన ఘర్షణల దృశ్యాలను ఇందులో ఇమిడ్చి భావోద్వేగాలను రేకెత్తించడానికి, పాస్టర్ గిడియాన్‌ను నిజంగా హిందూవులే  హత్య చేశారని చెప్ప‌డానికి ఈ వీడియో ద్వారా పెద్ద కుట్ర చేశారు. అంతర్జాతీయ క్రైస్తవ వెబ్‌సైట్‌లు ఈ వార్తలను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశాయి.

పోలీసులు నేరంపై దర్యాప్తు చేయక ముందే,  పెర్సిక్యూషన్ రిలీఫ్ హ‌త్య‌ను వక్రీక‌రించేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నించింది. చివ‌రికి ఇది ఆత్మహత్య కేసు అని స్ప‌ష్టంగా తేలింది. మృతుడు మెడ‌కు వేసుకున్న తాడు బిగుసుకుపోయి గొంతు, మెడ చుట్టూ రక్తం గడ్డకట్టడంతో ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్టు తెలింది. కానీ అతని శరీరంపై రక్తం యొక్క ఇతర ఆనవాళ్ళు లేవు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ త‌న త‌ప్పుడు నివేదిక‌లతో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించింది.

7: ఒడిశాలో పాస్టర్ సాన్వి హత్య
ఒడిషాలో పాస్ట‌ర్ సాన్వి హ‌త్య ఘటనను పెర్సిక్యూషన్ రిలీఫ్ త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ కేసుకు సంబంధించి త‌న నివేదికలో నేరం జరిగిన తేదీ, ప్రదేశం గురించి ప్రస్తావించలేదు. మరణించినవారి పేరు, ఇంటి పేరు లేకుండా నివేదిక రూపోందించారు.  ఏ స్వతంత్ర వెబ్‌సైట్ లేదా న్యూస్ ఛానెల్‌లో ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ఘటన గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. సంఘటనను ధృవీకరించే ప్రాథమిక వివరాలైన ఘటనా స్థలం, నేరం చేసిన తేదీ, మరణించిన వారి పూర్తి  వివరాలు లేనప్పుడు ఇటువంటి నివేదిక‌ల ప్రామాణికతను అస్సలు ధృవీకరించలేము.
8: రాజస్థాన్‌లోని షరోన్ చర్చికి చెందిన పాస్టర్ మహేష్ హత్య
రాజ‌స్థాన్‌లోని ష‌రోన్ చ‌ర్చి పాస్ట‌ర్ మ‌హేష్ త‌న గ్రామంలో విద్యుత్ స‌మ‌స్య త‌లెత్త‌డంతో విద్యుత్ స్థంభం ఎక్కి ఫ్యూజ్ ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్ఘాతంతో మ‌ర‌ణించాడు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ఈ ఘటనపై త‌న నివేదిక‌లో ప్రస్తావిస్తూ “పాస్టర్ మహేష్ ను క‌రెంట్ స‌మ‌స్య పరిష్కరించడానికి విద్యుత్ స్థంబం ఎక్క‌మ‌ని చెప్పి, అతను పైకి వెళ్ళినప్పుడు, కొంత మంది హిందువులు ఉద్దేశపూర్వకంగా విద్యుత్తును ఆన్ చేసి, అతడు కరెంట్ షాకుతో కింద ప‌డి చనిపోయేలా చేశారు. ఈ ఘ‌ట‌న‌పై గ్రామస్తులు సమావేశం నిర్వహించి  నిందితులకు రూ.2.50 లక్షల జ‌రిమానా విధించారు. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కూడ‌దని, సర్పంచ్, ఇతరులు నిర్ణయించుకున్నారు.” అని రాసుకోచ్చింది.
ఇది విద్యుదాఘాతంతో మరణించిన సాధారణ కేసు తప్ప మరొకటి కాదని స్థానిక వార్తాపత్రికలు స్పష్టం చేసాయి.
హిందువుల‌పై నిరాధార అభియోగాలు మోపి, అంతర్జాతీయ సమాజం ఎదుట హిందువులను, భారతదేశాన్ని అగౌరవపరిచేందుకు పెర్సిక్యూషన్ రిలీఫ్ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆధారాలతో హోంశాఖకు సమర్పించింది. సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరింది.
కొసమెరుపు:

లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ సంస్థ, తమ అధికారిక వెబ్సైట్ ని మూసివేయడం గమనార్హం.

Source: VSK Telangana