‘లవ్ జీహాద్’ నిరోధక ఆర్డినెన్స్ను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. బలవంతపు, నిజాయితీ లేని మత మార్పిడులను నిరోధించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ శనివారం ఆమోదం తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పిడుల నిషేధ ఆర్డినెన్స్, 2020 పేరుతో ఈ రాజశాసనం అమల్లోకి వచ్చింది. వక్రీకరణ, నిర్బంధం, మోసం, అనుచిత ప్రభావం, బలప్రయోగం, ప్రలోభం వంటివాటికి గురి చేసి లేదా పెళ్లి పేరుతో ఒక మతం నుంచి మరొక మతానికి వ్యక్తులను మార్చడం ఈ ఆర్డినెన్స్ ప్రకారం నేరం.
యువతుల బలవంతపు మత మార్పిడిని నిరోధించాలన్న లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఈ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపింది. చట్టవిరుద్ధ మతమార్పిడులు, మతాంతర వివాహాలను నిరోధించడమే ఈ ఆర్డినెన్స్ లక్ష్యం. యువతిని ఒక మతం నుంచి వేరొక మతంలోకి మార్చాలన్న ఏకైక లక్ష్యంతో వివాహం చేసుకుంటే, ఆ పెళ్లి చెల్లనిది అవుతుందని ఈ ఆర్డినెన్స్ చెప్తోంది.
ఈ నిబంధనలకు విరుద్ధంగా మత మార్పిడికి పాల్పడినవారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చు. నిర్బంధించి, దురాగతాలు లేదా మోసాల ద్వారా మతం మార్చినట్లు నిర్థరణ అయితే, అది నాన్ బెయిలబుల్ నేరం అవుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, మధ్య ప్రదేశ్ కూడా ఇటువంటి చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి.
More Stories
దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీలపై ఈసీ వేటు
123 ఏళ్ళ తర్వాత అలీఘర్ యూనివర్శిటీ విసిగా మహిళ