పాత నగరంలో వారు అభివృద్ధిని జరగనీయలేదని, మౌలిక వసతుల్ని రానీయలేదని, పాత నగరంలో వారు ప్రవేశపెట్టింది రోహింగ్యాలను మాత్రమే అంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. దేశంలో మోదీ పాలన ఉందని, నిజాం పాలన కాదని హెచ్చరించారు.
ఈ రోజు తెలంగాణాలో నరేంద్ర మోదీ ప్రజా అనుకూల పాలన కేసీఆర్ ఫార్మ్ హౌస్ పాలనకు మధ్య పోరాటం జరుగుతోందని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తామని, పాతబస్తీలో అరాచక శక్తులను తరిమికొడతామని హామీ ఇచ్చారు.
తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్తే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారని, తనను రెచ్చగొడితే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని అడ్డాగా చేసుకుంటానని సవాల్ విసిరారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలన్నారు. సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన ‘ఛేంజ్ హైదరాబాద్’ కార్యక్రమంలో వెబ్సైట్, సంతకాల సేకరణను ప్రారంభించారు.
టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు రాష్ట్రంలో కుటుంబ పాలన చేస్తున్నాయని తేజస్వి ఆరోపించారు. హైదరాబాద్ను ఇస్తాంబుల్ చేస్తానని కేసీఆర్ చెప్పారని, ఆ దేశంలో ఎవరి పాలన ఉందో ప్రజలు గుర్తించాలని కోరారు. ఆవాజ్ యోజన కింద 2 లక్షల గృహ నిర్మాణాల కోసం కేంద్రం రూ.1500 కోట్లు తెలంగాణ ఇచ్చిందని, ఇళ్లు ఎక్కడ నిర్మించారని, ఆ నిధులు ఏమి చేశారని ప్రశ్నించారు.
More Stories
భారత్ బలం అద్భుతమైన ఏకీకృత స్ఫూర్తిలోనే ఉంది
మున్సిపల్ ఎన్నికల వాయిదాకు రేవంత్ ఎత్తుగడలు
రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?