దీపావళికి దేశీయ ఉత్పత్తులనే కొనండి

దీపావళి పండుగవేళ దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రజలకు పండుగ బహుమతి ఇచ్చారు. 

రూ.614 కోట్లకుపైగా ప్రాజెక్టులకు సోమవారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తూ దీపావళి పండుగకు దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. 

‘దేశంలో తయారు కాని, గతంలో కొనుగోలు చేసిన ఉత్పత్తులను డంప్‌ చేయవద్దని, వాటిని కొనుగోలు చేయవద్దని నేను కోరడం లేదు. మట్టి దీపాలను మాత్రమే కొనడం అంటే అర్థం అది కాదు. స్థానిక ఉత్పత్తులకు చేయూతనివ్వడం’ అని మోదీ తెలిపారు. 

దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడి తయారీదారుల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా ప్రోత్సహించినట్లు అవుతుందని మోదీ చెప్పారు.   

వ్య‌వ‌సాయ‌, ప‌ర్యాట‌క రంగాల‌తో పాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించిన‌ అభివృద్ది ప‌నుల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శంకుస్థాప‌న చేసిన మోదీ.. యూపీ సీఎం యోగితో పాటు పలువురు ల‌బ్దిదారుల‌తో మాట్లాడారు.

రామ్‌న‌గ‌ర్‌లోని లాల్ బ‌హ‌దూర్ శాస్ర్తి హాస్పిట‌ల్ అప్‌గ్రేడ్ ప‌నుల‌కు, మురికి కాల్వ‌ల ప‌నుల‌కు, గోశాలల ర‌క్ష‌ణ‌, వాటికి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు, సంపూర్ణ‌నంద్ స్టేడియంలో ఆట‌గాళ్ల కోసం హౌజింగ్ కాంప్లెక్స్‌, విత్త‌నాల గోడౌన్‌కు, సార‌నాథ్ లైట్‌, సౌండ్ షోకు, ద‌శ‌శ్వామేథ ఘాట్‌, ఖైడ్‌ఖియా ఘాట్ రీ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌నుల‌కు, పీఏపీ పోలీస్ ఫోర్స్ బ్యార‌క్స్‌కు, వార‌ణాసిలోని రోడ్ల మ‌రమ్మ‌తుల‌కు, టూరిజం ప‌నుల‌కు మోదీ శంకుస్థాప‌న చేశారు.